Posted on 2025-07-12 17:42:43
క్రికెట్ మ్యాచ్ లను ప్రారంభించి క్రికెట్ ఆడిన జిల్లా ఎస్పీ..
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెండ్లి క్రికెట్ మ్యాచ్ లలో పోలీస్ A టీమ్ vs సిరిసిల్ల ప్రెస్ టీమ్ మరియు పోలీస్ B టీమ్ vs వేములవాడ ప్రెస్ టీమ్ ల మద్య ఉత్సాహంగా కొనసాగిన క్రికెట్ పోటీలు.
శనివారం రోజున జిల్లాలోని స్థానిక కళాశాల మైదానంలో పోలీస్ మరియు ప్రెస్ మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లను జిల్లా ఎస్పీ ప్రారంభించారు
మొదటగా పోలీస్ A టీమ్ మరియు సిరిసిల్ల ప్రెస్ మధ్య జరిగిన మ్యాచ్ లో పోలీస్ A టీమ్ గెలుపొందగా ,రెండవ మ్యాచ్ లో పోలీస్ B టీమ్ మరియు వేములవాడ ప్రెస్ మధ్య జరుగగా వేములవాడ ప్రెస్ టీమ్ గెలుపొందగా ఫైనల్ మ్యాచ్ పోలీస్ A టీమ్ మరియు వేములవాడ ప్రెస్ టీమ్ అడగా మొదట బ్యాటింగ్ చేసిన పోలీస్ A టీమ్ నిర్ణిత 10 ఓవర్లలో 77 పరుగులు చేయగా వేములవాడ ప్రెస్ జట్టు నిర్ణిత 10.ఓవర్లలో 73 పరుగులు చేయగా పోలీస్ A టీమ్ 4 పరుగుల తేడాతో గెలుపొందడం జరిగింది.
మొదటి ప్లేస్ పోలీస్ A టీమ్.
రెండవ ప్లేస్ వేములవాడ ప్రెస్ టీమ్.
మూడవ ప్లేస్ సిరిసిల్ల ప్రెస్ టీమ్.
అనంతరం జట్ల సభ్యులకు జిల్లా ఎస్పీ గారు బహమతులు అందించారు.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...
క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు కొంత సేపు ఆహ్లాదకరంగా గడిపారు అని అన్నారు. ప్రెస్, పోలీసుల మధ్య మంచి సస్సబంధాలు ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని. ప్రతి సంవత్సరం ఒక సారి ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆటవిడుపుతో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని అభిప్రాయపడ్డారు.
క్రికెట్ మ్యాచ్ ప్రారంభించే ముందు సిరిసిల్ల tv9 రిపోర్టర్ ప్రసాద్ ఇటీవల గుండెపోటుతో మరణించగా 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
ఈకార్యక్రమంలో పోలీస్ అధికారులు, పాత్రికేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >