Posted on 2023-12-17 19:43:23
డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ ప్రధాన కూడళ్లలో ఉన్నటువంటి మహనీయుల విగ్రహాలను రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడం తో మహనీయుల విగ్రహాలను తొలగించడం జరిగింది. మహబూబాబాద్ బస్టాండ్ ప్రాంగణంలో గల వివేకానంద సెంటర్, కొమరం భీం సెంటర్, ఇప్పుడు అండర్ బిర్జీగా వెలుగొందుతున్న గతంలో చిన్న గాంధీ సెంటర్, మూడు కోట్ల సెంటర్ కు వెళ్లే దారిలో గల సర్వేపల్లి రాధాకృష్ణ సెంటర్ కూడళ్లలో మహనీయుల విగ్రహాలు పెద్దలు ఏర్పాటు చేసి వారి నామకరణం తో బజార్లను పిలవడం జరుగుతుంది. రోడ్ల విస్తరణ కార్యక్రమంలో మహనీయుల విగ్రహాలను తొలగించి కానరాని ప్రదేశముకు తరలించడం జరిగింది. ఆ యొక్క విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు కావాలని కొంత ధ్వంసం చేస్తున్నారు. పార్టీల ముఖ్య నాయకులు అధికారులు ప్రజా ప్రతినిధులు మహనీయుల జయంతి వర్ధంతి రోజున మాత్రమే గుర్తు చేసుకునే విధంగా కాకుండా జనాభా ఎక్కువగా తిరిగే ప్రాంతాలలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసినట్లయితే మహనీయుల చరిత్రలు విద్యార్థులకు, ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయ వలసిందిగా ప్రజలందరి తరపున కోరుతున్నాం.
ఇండ్ల మహేష్
9885942502
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >