Posted on 2025-07-23 11:49:23
ఎంపీ అర్వింద్ కి లేఖ ద్వారా తెలియజేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:నిజామాబాద్ లో రైల్వే సౌకర్యాలు విస్తరణకు సంబంధించి మరో ప్రాజెక్ట్ కి ముందడుగు పడింది. గత రెండేళ్లుగా ఆర్మూర్ మీదుగా పటాన్ చెరు - ఆదిలాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ వేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని పలుమార్లు కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టు మంజూరు అయ్యిందని రైల్వే మంత్రి, ఎంపీ అర్వింద్ కి లేఖ రాసారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ తయారు చేస్తున్నారని, డీపీఆర్ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని మంత్రి లేఖలో పేర్కొన్నారు. కాగా తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, ఉత్తర తెలంగాణలో ముఖ్యమైన నూతన రైల్వే లైన్ మంజూరు చేసినందుకు ఎంపీ అర్వింద్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కి ధన్యవాదాలు తెలియజేశారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >