Posted on 2025-08-04 16:49:58
ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీల దినోత్సవానికి సిద్ధమవుతున్న ఆదివాసీలు
ఓ ఆదివాసి లారా మేల్కోండి కొర్స దొర
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో కొమరం భీం, సోయాం గాంగులు విగ్రహలు వద్ద ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆదివాసీల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర కోశాధికారి కొర్స దొర అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు,
ఈ సందర్భంగా కొర్సా వెంకటేష్ దొర మాట్లాడుతూ ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజున ఆదివాసులంతా ఏకమై తాసిల్దార్ కార్యాలయం పక్కన ఉన్న కొమరం భీం సొయం గంగులు విగ్రహాల వద్దకు చేరుకొని ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రతి ఒక్క ఆదివాసీల కృషి కావాలని కోరారు, అలాగే ప్రతి గ్రామాన ఆదివాసీ జెండా ఎగరాలని ఆదివాసి దినోత్సవ ప్రాముఖ్యతను చాటాలని ఆదివాసి హక్కులను కాపాడాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారి కొర్షా వెంకటేశ్ దొర ఆదివాసీలకు పిలుపునిచ్చారు,
ప్రతి గ్రామంలో ఉదయం ఏడు గంటలకి పంచాయతీలో ఉదయం 8 గంటలకు మండల కేంద్రంలో 9 గంటలకు నియోజకవర్గంలో 10 గంటలకు ప్రతి ఒక ఆదివాసీ నాయకులు హాజరయ్యి ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 9న విజయవంతం చేయాలని కొర్సా కోరారు,
ఆదివాసి దినోత్సవ సందర్భంగా ఆదివాసీల ఐక్యతను దృష్టిలో ఉంచుకొని అందరూ సమన్వయంతో అభివృద్ధి బాటలో నడవాలని తెలంగాణ రాష్ట్ర కోశాధికారి కొర్సా వెంకటేశ్ దొర తెలిపారు
వారితోపాటు ఈ కార్యక్రమంలో నాయకపొడు రాష్ట్ర నాయకులు గడ్డం వెంకటేష్ పాల్గొన్నారు
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >