Posted on 2023-12-27 18:10:32
డైలీ భారత్, టెక్సాస్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్ హైవేలో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది..
అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది..
జాన్సన్ కౌంటీలో ఉన్న 67వ నంబరు హైవేపై మినీవ్యాన్ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్కు చెందిన అమలాపురం వాసులుగా తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉందన్నది ఇంకా తెలియరాలేదు..
ఈ ప్రమాదంపై తానా సభ్యులు ఈనాడు.నెట్తో మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు. అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ సూచన మేరకు తానా ట్రెజరర్ అశోక్ కొల్లా, ఫౌండేషన్ ట్రెజరర్ పోలవరపు శ్రీకాంత్.. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు..
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >