Posted on 2025-09-24 18:24:36
డైలీ బారత్ న్యూస్, నిజామాబాద్: రాష్ట్ర ప్రజాసాంస్కృతిక పండుగ బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా బతుకమ్మ పోస్టర్ విడుదల కార్యక్రమం ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమం నిజామాబాద్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. పోస్టర్ను మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ అనురాధ, తెలంగాణ గెజెటెడ్ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సంగం అమృత్ కుమార్, టీజిఓ మహిళా విభాగం చైర్ పర్సన్ జయంతి కుమారి సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయ, సాంస్కృతిక విశిష్టతను ప్రతిబింబిస్తుందని, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. విద్యార్థినులు ఈ పండుగను సాంస్కృతిక ఉత్సవంగా భావించి ఉత్సాహంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజీవో పదాధికారులు దేవిసింగ్, పవనీ, నాగరాజు, చంద్ర, విజ్నేష్, సరస్వతి, విజయత, శ్రీతిల, సుజాత పాల్గొన్నారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >