Posted on 2025-09-25 08:21:42
8 మందికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలింపు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారి 44 పై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో బస్సులో ఉన్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. నిర్మల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సు సుద్దపల్లి సమీపంలో ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అజాగ్రత్త నడపడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉండగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న డిచ్పల్లి ఎస్సై షరీఫ్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన్నట్లు ఎస్సై తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >