Posted on 2025-09-25 10:21:42
8 మందికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలింపు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారి 44 పై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో బస్సులో ఉన్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. నిర్మల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సు సుద్దపల్లి సమీపంలో ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అజాగ్రత్త నడపడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉండగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న డిచ్పల్లి ఎస్సై షరీఫ్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన్నట్లు ఎస్సై తెలిపారు.
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-11 13:57:25
Readmore >