| Daily భారత్
Logo




స్నేహ సొసైటీలో ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

News

Posted on 2025-09-25 13:41:10

Share: Share


స్నేహ సొసైటీలో ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్  పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయరీకన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న దివ్యాంగుల పాఠశాలలో దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్  అర్బన్ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ  ముఖ్యఅతిథిగా పాల్గొని ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీని దయాలు దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భారతదేశంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ మరియు నరేంద్ర మోడీ ఇలాంటి నాయకులు దేశాభివృద్ధికి కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. దీన్ దయాల్  ఉపాధ్యాయ  హైందవ రాష్ట్రానికి పునాదిగా చెప్పబడే ఏకాత్మత  మానవత వాదం, శంకరాచార్య జీవిత చరిత్ర లాంటి పుస్తకాలు రాశారని, దీన్ దయాల్ ఉపాధ్యాయ సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు సంక్షేమం అందాలని ఆయన సూచించిన అంత్యోదయ సిద్ధాంతం. భగవంతుడు పిల్లల్లో కొంతమందిని  అవయవ లోపంతో సృష్టిస్తాడని, దానికి కృంగిపోకుండా వారికి ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సేవలను ఉపయోగించుకొని వృద్ధిలొకి రావాలని ఆయన కోరారు. స్నేహ సొసైటీ నిర్వహిస్తున్న దివ్యాంగుల పాఠశాలలో విద్యాభ్యాసం చేసే దివ్యాంగులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు అన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవాధ్యక్షుడు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మాట్లాడుతూ దివ్యాంగులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం దీన్ దయాల్ దివ్యాంగజన్  రియాబిలిటేషన్ స్కీం ను ప్రవేశపెట్టి స్వచ్ఛంద సేవ సంస్థలకు నిధులను అందిస్తుందని ఆయన తెలిపారు. దివంగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి సాధారణ పిల్లలతో సమానంగా ఎదగడానికి కృషి చేస్తున్న స్నేహ సొసైటీని ఆయన అభినందించారు. దివ్యాంగుల అభివృద్ధిని కాంక్షిస్తూ వారికోసం వివిధ కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తున్న స్నేహ సొసైటీని ఆయన అభినందించారు. దీన్ దయాల్  ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని నార్మల్ పాఠశాలలో మరియు దివ్యాంగుల పాఠశాలలో ఏర్పాటుచేసిన వ్యాసరచన,ఉపన్యాస పోటీలు, చిత్రలేఖనం, పాటల పోటీలు సాధారణ పిల్లలతో పాటు దివ్యాంగులను ప్రోత్సహించే విధంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఉత్తర మండల విద్యాశాఖ అధికారి వెంకట నారాయణ గౌడ్, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ ఎస్. సిద్దయ్య, కార్యవర్గ సభ్యులు వీరేశం, రమణారెడ్డి ల్యాబ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ జ్యోతి మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అంద విద్యార్థులకు క్యాష్ అవార్డులను అందించారు. ఈ సందర్భంగా దివ్యాంగ బాలలు సాంస్కృతిక కార్యక్రమాలు, యోగ నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో మానసిక దివ్యాంగులు, అంద విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >
Image 1

హామీలు మరిచి పాలన సాగిస్తే ప్రజలు సహకరించరు

Posted On 2026-08-11 13:59:26

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-11 13:57:25

Readmore >
Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >