Posted on 2025-10-11 12:37:07
మరో ఇద్దరు నిందితులు గతంలోనే రిమాండ్
కేసు ఛేదనలో కృషి చేసిన సిబ్బందికి రివార్డు..
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:భూమి, ఫ్లాట్ల విషయంలో తలెత్తిన వివాదం ఓ హత్యకు దారితీసింది. సిరిగిరి రమేష్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురికాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడైన చిర్రం రవిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శేషాద్రిని రెడ్డి తెలిపారు. ఈ కేసులో గతంలోనే మరో ఇద్దరు నిందితులు ఎద్దండి వెంకటేష్, అలా వంశీలను రిమాండ్కు తరలించడం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సిరిగిరి రమేష్ కు చిర్రం రవి చందుర్తిలో ఉన్న తన భూమిని ఎస్సీ కార్పొరేషన్ లోన్ పై పెట్రోల్ బంక్ నిమిత్తం రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే, సిరిగిరి రమేష్ పెట్రోల్ బంకు ఇవ్వకపోగా, భూమిని తిరిగి రవికి రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. దీంతోపాటు, ఈ భూమి నాదే అంటూ దాన్ని ఇతరులకు అమ్మడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అంతేకాకుండా, సిరిగిరి రమేష్ చాలా ఫ్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్ చేశాడని, ఆ ఫ్లాట్ల కొనుగోలుకు మధ్యవర్తిగా ఉన్న చిర్రం రవితో ఆ విషయంలోనూ గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో ఆగ్రహం చెందిన చిర్రం రవి, తన భూమి తనకు దక్కాలంటే రమేష్ను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఎద్దండి వెంకటేష్, అలా వంశీలతో కలిసి పథకం ప్రకారం హత్యకు పాల్పడ్డాడు. తేదీ 19-09-2025 రోజున రాత్రి సుమారు 08:00 గంటల సమయంలో పెద్దూరు సబ్ స్టేషన్ సమీపంలో కారు ఆపి, కారులో నిద్రిస్తున్న సిరిగిరి రమేష్ను అలా వంశీ గట్టిగా కాళ్లు పట్టుకొని ఉండగా, చిర్రం రవి వెనుక సీటులో కూర్చొని కదలకుండా పట్టుకున్నాడు. ఆ సమయంలో డ్రైవర్ సీటులో ఉన్న ఎద్దండి వెంకటేష్ వారు తెచ్చుకున్న కత్తితో రమేష్ గొంతులో, ఛాతీపై పలు మార్లు పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం, సిరిగిరి రమేష్ మరణించినట్లు నిర్ధారించుకొని, ఎద్దండి వెంకటేష్ శవాన్ని కారులో తీసుకువచ్చి వేములవాడలోని నంది కమాన్ సమీపంలో గల రమేష్ యొక్క నందీశ్వర టౌన్ షిప్ వెంచర్ లో కారు వదిలిపెట్టి పారిపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన చిర్రం రవిని శనివారం పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులైన ఎద్దండి వెంకటేష్ మరియు అలా వంశీలను గతంలోనే రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన ఎస్సై రామ్మోహన్, సిబ్బంది తిరుపతి, సమియుద్దిన్, రాజకుమార్, పాష, గోపాల్ లను రివార్డుతో అభినందించడం జరిగింది
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >