Posted on 2025-10-13 08:54:31
డైలీ భారత్, హైదరాబాద్:హైదరాబాద్ జూబ్లీహిల్స్లో బోగస్ ఓట్లు కలకలం సృష్టించాయి. ఒకే ఇంటి నంబర్పై 43 ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు బయటపెట్టారు. దీంతో ఈ కేసును ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్ బీ-బ్లాక్లో బూత్ నంబర్ 246లోని ఓటరు జాబితాను బీఆర్ఎస్ బూత్ ఇన్చార్జీలు పరిశీలించారు. ఆ జాబితా ప్రకారం ఓటర్లు ఉన్నారా? లేరా? అని తెలుసుకునేందుకు సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంట్కు వెళ్లారు. 8-3-231/బీ/160 నంబర్తో ఉన్న ఆ అపార్ట్మెంట్లో నూతన ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 43 మంది ఓటర్లున్నారు. వారంతా అపార్ట్మెంట్లో నివసిస్తున్నారా? లేరా? అని ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఓటరు జాబితాలోని ఓటర్ క్రమసంఖ్య 1006 నుంచి 1048 వరకు ఉన్న 43 మందిలో ఇద్దరు తప్ప మిగిలిన వారెవరూ అక్కడ లేరని తేలింది.
ఐదు అంతస్తులతో ఉన్న ఆ అపార్ట్మెంట్లో మొత్తం 15 ఫ్లాట్లు ఉండగా వాటిలో మూడు ఫ్లాట్లు ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. మరో 12 ఫ్లాట్లలో ఉంటున్నవారిని వాకబు చేయగా తాము సంవత్సర కాలం నుంచి ఇక్కడే ఉంటున్నామని చెప్పారు. వారిలో కొంతమంది ఓట్లు ఏపీలో ఉన్నాయని, మరికొందరు తమకు వేరే నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయని తెలిపారు. మిగతా వారు గతంలో అక్కడ నివసించి ఉంటారని అనుకుంటే, ఆ అపార్ట్మెంట్ కట్టి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ప్రస్తుతం ఉన్నవారే మొదటి నుంచీ అక్కడ ఉంటున్నట్టు తేలింది. అపార్ట్మెంట్ స్థానంలో గతంలో ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉండేదని, అందులో 40 మందికి పైగా ఉండే అవకాశమే లేదని స్థానికులు చెప్తున్నారు.
#hyderabad #jublihills #elections
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >