Posted on 2025-10-15 04:36:10
డైలీ భారత్, ఆర్మూరు:కట్టుకున్న భార్యను భర్త అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఆర్మూర్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. బాపట్లకు చెందిన వడ్ల జగదీష్, మమత (35) దంపతులు. గత కొంత కాలంగా వీరు ఆర్మూర్ లోని వేంకటేశ్వరకాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరూ పిల్లలు. జగదీశ్ పట్టణంలోని చెక్క మిల్లులో వర్కర్ గా పని చేస్తున్నాడు. కొంత కాలంగా జగదీష్ తన భార్య మమతపై అనుమానం పెంచుకున్నాడు. తన భార్య తన కళ్లు గప్పి వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం పెంచుకున్న జగదీష్ భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. తన భార్య మమతపై జగదీష్ అనుమానపు వేధింపులు తీవ్రం కావడంతో వీరి సంసారంలో ప్రశాంతత కరువైనట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం పని చేసే సా మిల్ నుంచి లంచ్ చేసేందుకు ఇంటికి వచ్చిన జగదీష్ భార్యతో మళ్లీ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరగడంతో కోపంతో విచక్షణ కోల్పోయిన జగదీష్ కత్తితో తన భార్య మెడను అతి కిరాతకంగా నరికాడు. దీంతో మమత అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం జగదీశ్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి తాను నేరం చేశానని ఒప్పుకున్నట్టు సమాచారం.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >