Posted on 2025-10-16 18:49:54
డైలీ భారత్ న్యూస్, నర్సంపేట/చెన్నారావు పేట:పోషణ మాసం సందర్భంగా ఐసిడిఎస్ నర్సంపేట పరిధిలోని చెన్నారావుపేట, తిమ్మరాయనపాడ్ సెక్టార్ సూపర్వైజర్లు రాధా, పారిజాతం ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని చెన్నారావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఓ మధురిమ, డాక్టర్ సరోజ ముఖ్య అతిథులుగా హాజరై. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోషణ మాసంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం జరిగింది. గర్భిణీలో బాలింతలు కిశోర బాలికలు, చిన్నపిల్లలు ప్రోటీన్స్,విటమిన్లతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలన్నారు. కిశోర బాలికలకు రక్తహీనత పై అవగాహన కల్పించి ఐరన్ అధికంగా ఉండే ఆహరపదార్థాలను సమృద్ధిగా తీసుకోవాలని తెలిపారు. స్త్రీల రుతుక్రమ పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. సరైన పోషణకహారం తీసుకోవడం స్థానికంగా లభించే ఆకుకూరలు పండ్లు కూరగాయలు చిరుధాన్యాలతో చేసినటువంటి రాగి జావా,మిల్లెట్స్ తో చేసినటువంటి ఆహారాలు అధికంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం వెల్ బేబీ షో నిర్వహించి పిల్లలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ కోఆర్డినెటర్స్ శ్రీలత,అనిత, ఐకెపి సభ్యులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >