Posted on 2025-10-17 14:32:19
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే బీసీ బంద్ కు మద్దతు గా శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల అన్ని యూనియన్లు, జర్నలిస్టులు పూర్తి మద్దతును తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్రం బీసీ బంద్ కు మద్దతుగా నిర్వహించిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ బీసీలకు ఎన్నో సంవత్సరాల నుండి అన్యాయం జరుగుతుందని, బీసీ లకు న్యాయం చేయుటకు నేటికైనా బీసీ లందరికీ 42% రిజర్వేషన్ కల్పించుటకు పోరాటం చేయడం జరుగుతుందని అన్నారు, అందుకు అన్ని కుల సంఘాలు , న్యాయవాదులు, వ్యాపారస్తులు, విద్యాసంస్థలు, పాటీగల్లి మున్నూరు కాపు సంఘం నాయకులు కూడా శనివారం నిర్వహించే బంద్ కార్యక్రమానికి పూర్తి మద్దతును తెలిపారు. తెలంగాణ బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ పోరాటం ప్రారంభం మాత్రమే అని , బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టం అయ్యేంతవరకు ఉద్యమంల కొనసాగుతూనే ఉంటుందని, అందుకు బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే ఊవ్వేతునా కొనసాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, అదేవిధంగా బీసీల రిజర్వేషన్ 42 శాతం అయ్యే అంతవరకు బిసి ఉద్యమం అంతవరకు కొనసాగుతూనే ఉంటుందని బీసీ నాయకులు తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ చైర్మన్ పోతనకల్ లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ బొబ్బిలి నరసయ్య, రాష్ట్ర ఆర్య క్షత్రియ వైస్ ప్రెసిడెంట్ అంబదాసరావు, బీసీ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆదె ప్రవీణ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ, సెక్రటరీ బైర శేఖర్, ఆర్గనైజ్ సెక్రెటరీ మండే మోహన్, సీనియర్ జర్నలిస్టులు జమాల్పూర్ గణేష్ , పాకాల నర్సింలు, గంగాదాస్, రాజేష్, పంచారెడ్డి శ్రీకాంత్, రజినిష్, గంగారెడ్డి, సతీష్ గౌడ్, నరసయ్యచారి, వెంకటేష్, రామచంద్ర రెడ్డి, సంగీత , శంకర్, వినోద్ కుమార్, చింతకాయల రాజు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >