Posted on 2025-10-18 17:33:42
విధినిర్వహణలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ ను హత్య చేసి పరార్ అవుతున్న వీడియోలు ఫోటోలు తీస్తూ కనీసం కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడాలని ధ్యాస లేని సిగ్గులేని సమాజం
కానిస్టేబుల్ హత్య ఉదంతంతో ఉలిక్కిపడుతున్న జిల్లా ప్రజలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మారదు లోకం.. మారదు సమాజం.. ఈ సిగ్గులేని సమాజం అని ఒక సినీ గేయ రచయిత ఓ సినిమాలో పాడిన పాటకు అక్షరాల నిజం చేసి చూపారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు. ఒక క్రిమినల్ పాత నేరస్తుడుని పట్టుకొని స్టేషన్లో అప్పజెప్పడానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో సిసిఎస్ కానిస్టేబుల్ అయిన ప్రమోద్ ను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేసి నిర్భయంగా పరారవుతున్న అక్కడే ఉన్న స్థానికులు ఫోటోలు వీడియోలు తీస్తూ కాలక్షేపం చేశారే తప్ప ఒక మనిషి చావు బతుకులో ఉన్నారు వారిని కాపాడాలని ఇంగిత జ్ఞానం కూడా లేని వారు ఒక్క క్షణం ఆలోచించి వారు మొబైల్ లో తీస్తున్న వీడియోలు ఫోటోలను ఆపి కానిస్టేబుల్ పై దాడి చేసి హత్యకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకోకుండా సినిమా చూసినట్లు చూశారే తప్ప ఏమీ చేయలేకపోయారు. ఫలితంగా విధుల్లో ఉన్నావు కానిస్టేబుల్ దీపావళి పండగ ముందు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అందుకే నిజామాబాద్ సిపి సాయి చైతన్య శనివారం ఉదయం జిల్లా ప్రజల్లో మానవత్వం ఏమాత్రం లేదని వ్యాఖ్యానించారు అందులో ఏమాత్రం తప్పులేదు. ఒకవేళ అదే ప్రాంతంలో ఎవరో ఒక రౌడీ ఒక ఇంటిపై డాడీ చేసి ఇంట్లో ఉన్న వారిని గాయాలపాలు చేసి హత్య చేస్తే ఇలానే నిర్లక్ష్యంగా ఊరుకుంటారా అని మనలో మనమే ఒకసారి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఏముంది ఆ కుటుంబానికి పండగ ముందు ఆ కిరాతక నరహంతకుడు చేసిన గాయం జీవితాంతం మర్చిపోలేని పరిస్థితి. ఇప్పటికైనా సమాజంలో ప్రతి ఒక్కరూ మారాలి, మనము మంచి ఉంటే సరిపోతుంది ఎదుటివారు ఏమవుతే మనకి ఏమైతుంది అనే ఆలోచించే వారికి రేపటి నాడు తమ కుటుంబం పైనే ఎవరో ఒకరు దాడి చేస్తే చూస్తూ ఊరుకుంటారా వారిని రక్షించాల్సింది పోలీసులు కాదా.. అనే కనీస ఇంగిత జ్ఞానం తెలియకుండా ప్రవర్తించారు. కానిస్టేబుల్ పై దాడి జరిగిన సమయంలో అక్కడ ఉన్నవారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >