Posted on 2025-10-19 10:00:08
*Press Release*
డైలీ భారత్, అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. అంధకారంపై వెలుగు విజయం సాధించిన దీపావళి పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, ఐకమత్యం, సంతోషం నింపాలని ఆకాంక్షించారు.ఈ దీపావళి ప్రతి ఇంటికి వెలుగు మాత్రమే కాదు, ఆశ, అభివృద్ధి, సంక్షేమం కూడా తీసుకురావాలి. మన రాష్ట్రం మరోసారి వెలుగులా ప్రకాశించడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, కూటమి ప్రభుత్వ కృషి పునాది అవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ఈ ప్రభుత్వానికి ధ్యేయమని, ప్రతి నిర్ణయం ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రైతులు, యువత, మహిళలు, వృద్ధులు, ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
సీఎం చంద్రబాబు నాయుడు చూపుతున్న నాయకత్వం వల్ల రాష్ట్రం మళ్లీ అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. సాంకేతికత, విద్య, వ్యవసాయం, పరిశ్రమ, ప్రతి రంగంలో ఆవిష్కరణలతో ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు లభిస్తున్నాయని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజల విశ్వాసం కూటమి ప్రభుత్వానికి బలమని, ప్రతి ఒక్కరి ఇంట్లో దీపాలు వెలిగేలా ఆర్థికాభివృద్ధి, అవకాశాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులా మారాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >