| Daily భారత్
Logo




ఆత్మరక్షణ కోసమే ఏ ఆర్ ఎస్ ఐ ఖైదీ రియాజ్ పై కాల్పులు జరపాలిసి వచ్చింది

News

Posted on 2025-10-20 18:47:49

Share: Share


ఆత్మరక్షణ కోసమే ఏ ఆర్ ఎస్ ఐ ఖైదీ రియాజ్ పై కాల్పులు జరపాలిసి వచ్చింది

నిజామాబాద్ సిపి సాయి చైతన్య వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వఆసుపత్రిలో ఖైదీ వార్డులో (ఐసో లేషన్ వార్డు) లో చికిత్స పొందుతున్న సమయంలో రియాజ్ ముందుగా హస్పీటల్ అద్దాలను ధ్వంసం చేశాడు.

సౌండ్ గమనించిన అదే సమయంలో రెగ్యూలర్ తనిఖీలలో బాగంగా ఎఆర్ పోలీసులు ప్రిజనరీ వార్డును తనిఖీ చేసేందుకు వచ్చారు. అప్పుడు అక్కడికి చేరుకున్న రిజర్వ్ సిబ్బంది రియాజ్ ను వారించారు. కాని వారిని పట్టించుకోకుండా ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీని లాక్కున్నాడు. తుపాకిని పారేయాలని పోలీసులు చెబుతున్న వినకుండా తుపాకీ తో కాల్చేందుకు ( ట్రిగ్గర్ నొక్కేందుకు) ప్రయత్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏ ఆర్ ఎస్ ఐ ఆత్మ రక్షణార్థం జరిగిన కాల్పులలో రియాజ్ ఖతం అయ్యాడు అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం జిల్లా జనరల్ ఆసుపత్రిలో జరిగిన రియాజ్ ఎన్ కౌంటర్ పై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ తప్పనిసరి పరిస్థితులలోనే కాల్పులు జరపడం జరిగిందని అందులోనే రియాజ్ హతం అయ్యారని అన్నారు. రియాజ్ కిందపడి తిరిగి లేవ లేదని తెలిపారు. ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేయడం జరుగుతుందని దీనిపై విచారణ జరుపుతామని తెలిపారు. రియాజ్ ఎన్ కౌంటర్ కు గల కారణాలు విచారణలో తేలుతాయని తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో అదనపు డిసీపీ బస్వారెడ్డి తదితరులు పాల్గోన్నారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >