Posted on 2025-10-21 08:35:27
డైలీ భారత్, మంచిర్యాల:మంచిర్యాల జిల్లా రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దాగామ శ్రీశైలం (25) ఆలుగామ గ్రామం సమీపంలోని ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లి దురదృష్టవశాత్తు గల్లంతయ్యాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోటపల్లి ఎస్ఐ రాజేందర్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
దీపావళి పండుగ సందర్భంలో మంగళవారం శ్రీశైలం నదిలో స్నానం చేయడానికి వెళ్లి నీటిలో మునిగిపోయిన విషయం తెలిసిందే.
సహాయక చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రి శ్రీ వివేక్ గారు అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ఎస్ఐ రాజేందర్, స్థానిక కాంగ్రెస్ నాయకులు గట్టు లక్ష్మన్ గౌడ్ తదితరులు నది వద్దనే ఉండి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
గాలింపు చర్యల కోసం పక్క రాష్ట్రం మహారాష్ట్ర అధికారులతో మాట్లాడి ఒక బోటును తీసుకురావడంతో పాటు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >