| Daily భారత్
Logo




ప్రభుత్వ టీచర్లకు బిగ్ షాక్... ఆఖరి ఆశలు గల్లంతు

News

Posted on 2025-10-21 14:00:22

Share: Share


ప్రభుత్వ టీచర్లకు బిగ్ షాక్... ఆఖరి ఆశలు గల్లంతు

ప్రభుత్వ టీచర్లకు బిగ్ షాక్ తగిలింది. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను NCTE రిజెక్ట్ చేసింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రెండేళ్లలో తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాల్సిన పరిస్థితి ఏర్పడింది

డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (NCTE) షాక్ ఇచ్చింది. ఇప్పటికే సర్వీసులో ఉన్న ప్రభుత్వ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వినతిని NCTE తిరస్కరించింది. ఐదేళ్లకు మించి సర్వీసు ఉన్నవారంతా 2 ఏళ్లలో టెట్ పాసవ్వాల్సిందేనని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 2017 పార్లమెంట్ తీర్మానం ప్రకారం ఈ తీర్పు ఇచ్చినందున.. అంతకుముందు నియమితులైన వారికి వర్తింపచేయరాదని టీచర్లు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని ఆశ్రయించారు. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో NCTE వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉపాధ్యాయులు తమ భవిష్యత్ గురించి కొత్త ఆందోళన చెందుతున్నారు.

ఈ వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో ప్రారంభమైంది. ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న అందరూ ఉపాధ్యాయులు కచ్చితంగా టెట్ క్వాలిఫై కావాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది. రెండేళ్లలో టెట్ పాస్ అవ్వాలని ఆదేశించింది. ఒకవేళ టెట్‌కు క్వాలిఫై అవ్వకపోతే ఉపాధ్యాయులు తప్పనిసరిగా పదవీ విరమణ చేసి.. సర్వీసు నుంచి తొలగిస్తామని ఆదేశించింది. దీంతో ఉపాధ్యాయులు ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని ఆశ్రయించగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది.

2017 సవరణలో చేసిన నిబంధనల మాదిరిగానే.. 2017 కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్‌ మినహాయింపు నుంచి ఇవ్వాలని NCTE ని కోరారు. ఈ ఉత్తర్వులు అమలుతో విద్యా వ్యవస్థలో తీవ్ర సంక్షోభానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధించడం కంటే.. తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి టెట్‌కు సిద్ధమవ్వడంపై దృష్టిపెడతారని.. దీంతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాదించారు. ఉద్యోగ పోతుందనే భయంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారని.. ఇది వారి బోధనా పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పిటిషనర్ల తరుఫున వాదనలు వినిపించారు. అయితే అన్ని ఊహాగానాలకు ముగింపు పలుకుతూ.. ఈ పిటిషన్‌ను అధికారికంగా  NCTE కొట్టిపడేసింది. ఈ కేసుకు ముగింపు పలుకుతున్నట్లు స్పష్టం చేసింది

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >