Posted on 2025-10-22 09:32:42
విద్యార్థినితో పరారైన వైనం - సిరిసిల్లలో చర్చనీయాంశం..!
డైలీ భారత్,రాజన్న సిరిసిల్లజిల్లా: విద్యా బుద్ధులు నేర్పిన గురువే.. ప్రేమ పాఠాలు చెప్పాడు.. సభ్య సమాజం.. చదువు సంస్కారం నేర్పించాల్సిన వాడే.. వక్ర మార్గం వైపు నడిపించాడు.. సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు.. ఇంటర్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పని చేసే ఓ గురువు.. డిగ్రీ చదువుతున్న విద్యార్థినితో పరారైన ఉదంతం రాజన్న జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రిన్సిపాల్ నిర్వాకంపై సిరిసిల్ల ప్రజలు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తమ కళాశాలలో విద్యనభ్యసించే ఓ విద్యార్థినితో కొంతకాలంగా చనువుగా ఉంటూ వచ్చాడు. ప్రస్తుతం ఆ విద్యార్థిని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటుంది. గతంలో ఇంటర్ సమయంలోనే విద్యార్థినినీ ప్రలోభపరిచిన అధ్యాపకుడు ఈసారి ఏకంగా ఆమెతో కలిసి గత రెండు రోజుల క్రితం అదృష్టమైనట్టు సమాచారం. ప్రిన్సిపల్, విద్యార్థిని ఇద్దరూ కనిపించకుండా పోయిన ఘటన జిల్లా వ్యాప్తంతగా సంచలనం రేపుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని ప్రజలు కోరుతున్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >