Posted on 2025-10-28 14:31:29
కార్పొరేట్ శక్తుల నుంచి కులవృత్తులను కాపాడుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ కోసం ఐక్యంగా పోరాడాలికొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని ఉత్సాహంగా నాయిబ్రాహ్మణ సేవ సంఘం జిల్లా మహాసభ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నాయి బ్రాహ్మణ సేవా సంఘం 500/82 జిల్లా మహాసభ కొత్తగూడెం శేషగిరి భవన్ ఏఐటియుసి కార్యాలయం కొమరవెల్లి రవీందర్ అధ్యక్షతన జరిగినది. మహాసభకు ముఖ్య అతిధిగా హాజరైన కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ శాసనసభ సభుయునిగా గతంలో 2009 ప్రస్తుతం 2023 గెలిచిన కాడి నుండి చేతివృత్తుల వారికి చేతిని ఇచ్చే సంక్షేమ నిధులు వారి భవన నిర్మాణాల కోసం ఎమ్మెల్యే పండు కింద కేటాయిస్తున్నారని నాయి బ్రాహ్మణులకు కూడా 25 లక్షల రూపాయలు నాయి బ్రాహ్మణ భవన నిర్మాణ సంక్షేమ కార్యాలయం కోసం మంజూరు చేశానని తెలిపారు,, వృత్తిదారులకు ఎప్పుడు ఏ అవసరమున్న సిపిఐ పార్టీ అండగా ఉంటుందని నేను ప్రజల మనిషిని నిరంతరం ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేస్తానని వారన్నారు, వృత్తిదారులపై కార్పొరేట్ వ్యవస్థ ఉక్కు పాదం మోపుతుందని కార్పొరేట్ సెలూన్లు పెట్టి సామాన్య వృత్తిదారులను పొట్ట గొడుతున్నదని ఆ విధానాన్నితిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతి వృత్తిదారిపై ఉన్నదని అందుకు కమ్యూనిస్టు పార్టీగా మీకు మేము అండగా ఉంటామని జిల్లా కార్యదర్శి సాబీర్ పాష అన్నారు, నాయి బ్రాహ్మణుల వృత్తిపై పేటీఎం డ్రాకు కల్పించే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని ఆదాని, అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులు మంగలి వృత్తిని హైజాక్ చేస్తూ నాయి బ్రాహ్మణులను రోజు కూలీలుగా పెట్టుకుంటున్నారని ఈ విధానం రూపుమాపేలా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని అన్నారు. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, రాష్ట్రసంఘఉపాధ్యక్షులు తూముల శ్రీనివాస్ మాట్లాడుతూ తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ నియామకం చేసి జిల్లాకు ఒక డైరెక్టర్ ని ఎంపిక చేసి నాయి బ్రాహ్మణ సంక్షేమ నిధి 200 కోట్లు ప్రకటించాలని అలాగే మృత్తిదారుల సెలవులకు ఇస్తున్నారు 250 యూనిట్ల కరెంటు పెండింగ్ బిల్లులు అంటూ వృత్తిదారులను వేధిస్తున్నారని ఎలక్ట్రిసి డిపార్ట్మెంట్కు సరైన సూచనలు ఇచ్చి మృత్తిదారుల సెలూన్ లపై ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దాడీలు చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని వారన్నారు ఈ జిల్లా మహాసభల్లో, జిల్లా అధ్యక్షులుగా తూముల సదానందం ప్రధాన కార్యదర్శి రాచకొండ నాగేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్ రావ్ ముత్యాల లక్ష్మణ్ కోశాధికారి సోములపల్లి బాలకృష్ణ గౌరవ అధ్యక్షులుగా తూముల శ్రీనివాస్, కొమరవెల్లి రవీందర్, మల్లెల నరసింహారావు, కురిమిళ్ళ దుర్గయ్య, గౌరవ సలహాదారులుగా కొలిపాక వెంకటేశ్వరరావు, చందర్లపాటి మణికుమార్ రావు, ఉబ్బనపల్లి వెంకటేశ్వరరావు, మంత్రి కురిమిళ్ళ వెంకన్న, ఉరిమిళ్ళ శంకర్, జిల్లా అధికార ప్రతినిధిగా సోములపల్లి వెంకటేశ్వర్లు (ఎస్ వి), ఉపాధ్యక్షులుగా మంతెన శాంతారావు, జంపాల వెంకన్న, కురిమిళ్ళ రవికుమార్, అవుదుర్తి రాజేష్, సహాయ కార్యదర్శులుగా శేషాద్రి వినోద్, అవుదుర్తి వెంకటరావు, శ్రీరాముల ఉదయకుమార్, మంతెన శ్రీనివాస్, దేవరకొండ శ్రీనివాస్, ప్రచార కార్యదర్శులుగా కొత్తగట్టు రమేష్, సంఘపు భీమ్ రాజ్, కుదురుపాక రమేష్, ముత్యాల వేణు, మాదాసు, సత్యనారాయణ, చంద్రగిరి మురళి, ఏకగ్రీవంగా ఎన్నికున్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >