Posted on 2025-11-02 12:44:59
నడి చౌరస్తాపై విద్యార్థినులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం
విద్యార్థినిపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్
మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టి ఈడ్చుకుని కొట్టిన విద్యార్థినిలు
విద్యార్థినీలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలింపు
డైలీ భారత్, రంగారెడ్డి:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ శివారులో నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినిల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కమ్మదనం వద్ద ఓ భవనంలో కొనసాగుతున్న ఈ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినిలు ప్రిన్సిపల్ అక్రమాలు వేధింపులపై గళం ఎత్తి మెరుపు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆదివారం కావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున కళాశాల భవనం నుండి రోడ్లపైకి వచ్చారు. అయితే ఈ క్రమంలో పట్టణ చౌరస్తాకు చేరుకున్న విద్యార్థినిలు ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు ఆందోళన విరమింప చేయడానికి బలవంతంగా విద్యార్థినీలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థినిలతో ఓ మహిళా కానిస్టేబుల్ వాగ్వివాదానికి దిగారు. ఇంతలో ఓ విద్యార్థినిపై చేయి చేసుకోవడం చూసి మిగతా విద్యార్థులు ఆగ్రహానికి గురై తమనె కొడతారా అంటూ మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని ఈడ్చుకుని చితకబాదారు. ఈ ఘటనకు అందరూ నిశ్చేస్తులై పోయారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వస్తే మమ్మల్ని కొడతారా అంటూ విద్యార్థులు నిలదీశారు. ఒకరిపై చేయి చేసుకున్న ఎవరిని విడిచిపెట్టబోమని విద్యార్థినిలు తీవ్రంగా పోలీసులను హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థినిలను బలవంతంగా కొంతమందిని పోలీసు వాహనంలోకించుకొని వెళ్లిపోయారు. మహిళా సిబ్బంది సరిగ్గా సంఖ్య లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి..
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >