| Daily భారత్
Logo




ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి

News

Posted on 2025-11-04 14:28:54

Share: Share


ఇందిరా పార్క్ వద్ద  జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రెడ్డి సంఘాలు ఒకే వేదికపై వచ్చి రెడ్డిజాతికి జరుగుతున్న అన్యాయాన్ని విద్యా ఉద్యోగాలు ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయాలపై ఈ డబ్ల్యూ ఎస్ అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రభుత్వానికి తెలిపేందుకు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లబెల్లి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అగ్రవర్ణాల్లోని పేదలకు రాజ్యాంగబద్ధంగా వారికి రావలసిన వాటాను ప్రభుత్వం వారికి ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు

 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలుగా వస్తున్న వారు ఇచ్చినటువంటి రెడ్డి కార్పొరేషన్ ఇప్పటివరకు చట్టబద్ధంగా కార్పొరేషన్ కి రూపం లేకపోవడం కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేకపోవడం బాధాకరమని నాయకులు అన్నారు. ఈడబ్ల్యూఎస్ కమిషన్ను రాష్ట్రస్థాయిలో జాతీయస్థాయిలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఎటువంటి సహాయం చేసిన దాఖలాలు లేవు. దీనివల్ల కేవలం ఎమ్మెల్యేగా ఉన్న కుటుంబాలకు మాత్రమే లాభం చేకూర్తులు తప్ప మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఎటువంటి ఉపయోగం లేదని ఈ సందర్భంగా అన్నారు. ఇప్పుడు కావలసింది అగ్రవర్ణాలను పేదలకి విద్య వైద్య ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించాలని అగ్రవర్ణాలకు రావాల్సిన నిధులను ఉద్యోగాలను వారి జనాభా ప్రకారం వారు కేటాయించాలని ఈ సందర్భంగా రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఒక నెల రోజుల గడువు విధించి రానిపక్షంలో ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని అన్నారు

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ రెడ్డి రాష్ట్ర నాయకులు మధుసూదన్ రెడ్డి జిల్లా నాయకులు రాంరెడ్డి రవీందర్ రెడ్డి నరేందర్ రెడ్డి మోహన్ రెడ్డి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 16:02:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 16:00:41

Readmore >