Posted on 2025-11-05 14:19:06
ఇంటి ముంగిళ్లలో తులిసమ్మ కోటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన సుహాసినిలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన మాసాల్లో కార్తీకమాసం ప్రత్యేకమైనది గా చెప్పుకుంటారు శివుని భక్తులు. అది కార్తీక పౌర్ణమి రోజున ఆ దేవదేవుని సన్నిధిలో ఆ ఉసిరికాయలను వేద పండితులకు సమర్పిస్తే ఎంతో మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉదయం తెల్లవారుజామున నుండి మహిళా భక్తులు శైవ క్షేత్రాలకు చేరుకుని శైవ క్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుండి ఆలయాలకు వచ్చిన భక్తులు రాత్రి వరకు కూడా భక్తుల రాక కొనసాగింది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రమైన శ్రీ నీలకంటేశ్వరాలయంలో మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో వివిధ దూర ప్రాంతాల నుంచి సైతం వచ్చి దీపాలను వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఇంటి ముంగిళ్ళలో ఉండే తులసమ్మ కోటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉసిరికాయలతో దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు. చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి తమ ఇంటి ముంగిళ్లలో ఉన్న తులసికి ప్రత్యేక పూజలుఇంటి ముంగిళ్లలో ఉన్న తులసికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత అని భక్తులు పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఆ పరమేశ్వరుని ఆశీస్సులు తమ ఇంటిల్లిపాది పట్ల ఉండాలని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >