Posted on 2025-11-11 18:42:38
ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దాస్టికం
వైద్యం కోసం వెళ్లి మృతి చెందిన వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు అపహరించిన ఆస్పత్రి సిబ్బంది
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్లిన వృద్ధురాలు మృతిచెందగా.. ఆమెపై ఉన్న బంగారు గొలుసు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన నగరంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హైదరాబాద్ రోడ్డులోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ వృద్ధురాలు గుండె సంబంధిత వ్యాధితో చేరింది. అయితే ఆదివారం తెల్లవారుజామున ఆస్పత్రిలో చేరగా.. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో మృతి చెందింది. అయితే ఆమె మెడలో ఉన్న 18 గ్రాముల బంగారం గొలుసు చోరీకి గురైనట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బందే గొలుసు చోరీ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ ఒక్క ఘటనతోనే కాదు జిల్లా కేంద్రంలోని ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది, ఆయాల నుంచి వాచ్మెన్ వరకు రోగి ఆసుపత్రిలో చేరిన నుండి వారు డిశ్చార్జ్ అయ్యేవరకు వారి బంధువుల నుండి ఏదో ఒక రూపంలో బలవంతంగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా తాజాగా ఓ వైద్యం కోసం వచ్చి మృతి చెందిన వృద్ధురాలి మెడలో ఉన్న బంగారాన్ని కాజేసిన ఘటన కలకలం రేపింది. కాగా.. ఘటనకు గల సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఆ ప్రైవేట్ ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదంటూ ఆసుపత్రి మేనేజ్మెంట్ చెప్పడం విడ్డూరంగా అనిపిస్తుంది.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >