Posted on 2025-11-15 11:57:36
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ విద్యాసంస్థ కు చెందిన స్కూల్ బస్సు కిందపడి క్లీనర్ మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది . నగరంలోని ప్రముఖ ప్రైవేట్ పాఠశాల చెందిన బస్సు అర్సపల్లి ప్రాంతంలో విద్యార్థులను స్కూలుకు తీసుకు రావడానికి వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో బస్సు వెనక్కి తీసే క్రమంలో క్లీనర్ జక్కుల కిషన్ వెంకటయ్య ప్రమాదవశాత్తు బస్సు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అంతలా అజాగ్రత్తగా నడిపిఅంతలా అజాగ్రత్తగా నడపే డ్రైవర్ను జిల్లాలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన విద్యాసంస్థ యాజమాన్యం ఏ అర్హతతో సదరు డ్రైవర్ను నియమించుకున్నారో ఆ పాఠశాల యాజమాన్యానికే తెలియాలి. అంతలా అజాగ్రత్తగా నడపే ఆ డ్రైవర్ ఒకవేళ అందులో బస్సులో పాఠశాల చెందిన విద్యార్థులు ఉంటే ప్రమాదం జరిగి ఉంటే బాధ్యత ఎవరు వహిస్తారని స్థానికులు పేర్కొంటున్నారు. నిజామాబాద్ రూరల్ మండలం ధర్మారం (ఎం) గ్రామానికి చెందిన జక్కుల కిషన్ రెండు రోజుల క్రితమే స్కూల్ బస్సు క్లీనర్ గా చేరాడు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఆరవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >