Posted on 2025-11-20 15:48:07
ధాన్యం వేగంగా కొనాలి.. డబ్బులు వెంటనే చెల్లించాలి.
నాణ్యమైన గన్నీ సంచులు సరఫరా చేయాలి
కాటా వేసిన బస్తాలను వెంటనే తరలించాలి.
ప్యాడీ డ్రైయర్ మిషన్ ఖర్చును ప్రభుత్వం భరించాలి.
సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.
డైలీ భారత్ న్యూస్, వైరా:రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా ధాన్యం కొనుగోలు జరపాలని, కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు వెంటనే రైతులకు చెల్లించాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వైరా వ్యవసాయ మార్కెట్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిపిఎం బృందం పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలోని సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన గన్నీ సంచులు సరఫరా చేయాలని, కాటా వేసిన ధాన్యం బస్తాలను వెంటనే తరలించాలని అన్నారు. ప్యాడీ డ్రైయర్ మిషన్ వల్ల రైతులకు ఖర్చు పెరుగుతుందని తెలిపారు. ప్యాడీ డ్రైయర్ మిషన్ లో గంటకు ఐదు లీటర్ల డీజిల్ కాలుతుందని, గంటకు కేవలం 8 శాతం తేమ మాత్రమే తగ్గుతుందని, 20 బస్తాల ధాన్యానికి సుమారు 5000 రూపాయల ఖర్చు అవుతుందని, ఇది రైతులకు భారం అని అన్నారు. ప్యాడీ డ్రైయర్ మిషన్ ఖర్చును ప్రభుత్వం భరించాలి డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారులు రైతులకు అండగా నిలబడాలని, రైతులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, నాయకులు గుడిమెట్ల రజిత, హరి వెంకటేశ్వరరావు, పైడిపల్లి సాంబశివరావు, గుడిమెట్ల మోహనరావు, కొంగర సుధాకర్, కామినేని రవి, బెజవాడ వీరభద్రం, గొల్లపుడి ప్రకాశరావు, అమరనేని కృష్ణ, చిత్తోజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >