Posted on 2025-12-09 17:10:23
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ మత్స్య సంపదను 2047 నాటికి అగ్ర భాగాన నిలబెడతామని సదస్సులో రాష్ట్ర క్రీడా, పశుసంవర్ధక,మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గోదావరి, కృష్ణ నదుల మధ్య ఉన్న తెలంగాణలో 26 వేల నీటి వనరులు కలిగిన తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద ఉత్పత్తి కి చాలా అనుకూలమైన ప్రదేశమని రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న అన్ని రిజర్వాయర్లు చెరువులల్లో 122 కోట్ల బడ్జెట్ తో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు. చెరువులలో చేప పిల్లలను ఒక నిష్పత్తి ప్రకారం వదలడం జరిగిందని మంత్రి తెలియజేశారు. ఈ సంవత్సరం 8 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మత్స్య సంపద ద్వారా రాష్ట్రానికి అదనపు ఆదాయం వస్తుందన్నారు.మత్స్య పరిశ్రమలో ఐదు లక్షల కుటుంబాలు జీవనోపాధి కొనసాగిస్తుందని.రాష్ట్రంలో పాల ఉత్పత్తిలో విజయ డైరీ ని మరింత ఆధునీకరిస్తామన్నారు. రాష్ట్రంలో రోజుకు 95 లక్షల లీటర్ల పాలు అవసరం ఉండగా ప్రస్తుతం 35 లక్షల లీటర్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతుందని తెలిపారు. దీనిని అధిగమించడానికి రైతులకు పాల ఉత్పత్తి పెంచే గేదెలను ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.రాష్ట్రానికి సరిపోయి మిగతా పాలను దేశంలో వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు పిలుపునిచ్చారు.రాష్ట్రంలో డైరీ సెక్టార్ లో బిజినెస్ కు అపార అవకాశాలు ఉన్నాయని పాల ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, నిఖిల ఐ.ఏ.ఎస్, గోపి ఐ.ఏ.ఎస్, చంద్రశేఖర్ రెడ్డి ఐ.ఏ.ఎస్,శ్రీనివాస్ - ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అడ్వైజర్, విజయ్ గుప్త, జె ఎస్ యాదవ్ ఎం డీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అగ్రికల్చర్, ఎ కె సింగ్ హార్టికల్చర్ ఐసిఎఆర్ సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >