Posted on 2025-12-10 03:22:42
వివిధ అంశాలపై సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం.
డైలీ భారత్ న్యూస్,రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇంటి పన్ను వసూలు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇంటి, నీటి పన్ను వసూలు, ట్రేడ్ లైసెన్స్, తడి, పొడి చెత్త సేకరణ, వివిధ అభివృద్ధి పనుల పురోగతి, సిబ్బంది, వాహనాల అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇప్పటిదాకా ఇంటి, నీటి పన్ను వసూలుపై ఆరా తీశారు. అధికారులు, సిబ్బందితో ఒక ప్రణాళిక ప్రకారం వసూలు చేయాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో తడి, పొడి చెత్త సేకరణ, ఎన్ని ట్రాక్టర్లు, ఆటోలు ఉన్నాయి? సెగ్రిగేషన్ చేసే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ప్రారంభించిన రోడ్లు, మురుగుకాలువలు, జంక్షన్ల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో షేటర్లు వివరాలపై ఆరా తీశారు. ట్రేడ్ లైసెన్స్, మెప్మా పరిధిలో మహిళా సంఘాల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, అన్వేష్, డీటీసీపీఓ అన్సార్, డీఈలు, టీపీవోలు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >