Posted on 2025-12-11 20:27:07
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా విధులు నిర్వహిస్తుండగా వినాయక్ నగర్ చెందిన సోనీ అనే మహిళ ఫిట్స్ రావడంతో పడిపోవడం జరిగింది దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి డ్రైవర్ షాకీర్ హుటాహుటిన ప్రధమ చికిత్స చేసి మానవుత్వాన్ని చాటుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ పోలీసులు తమ విధుల్లో భాగంగా ట్రాఫిక్ ను నియంత్రించడంతోపాటు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో అమాయక యువత రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా నిత్యం ఆయా చోట్ల ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే నిరాశ్రయులు, పాదాచారులకు అకస్మాత్తుగా ఏదైనా ఆరోగ్యపరంగా ప్రమాదం సంభవిస్తే వెంటనే స్పందిస్తూ వారికి మెరుగైన చికిత్స అందిస్తూ వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పుతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసుల తీరు పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >