Posted on 2025-12-16 01:38:52
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో బూరగడ్డ, లింగగిరి, శ్రీనివాసపురం గ్రామాలలో పోలీసులు కవాతు నిర్వహించారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు కాపాడడం, ఓటర్లలో భద్రతా భావన పెంపొందించడం లక్ష్యంగా ఈ కవాతు చేపట్టారు. పోలీస్ అధికారులు గ్రామ వీధుల గుండా కవాతు నిర్వహిస్తూ ప్రజలకు పలు సూచనలు చేశారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అక్రమాలకు, ప్రలోభాలకు, బెదిరింపులకు లోనుకావద్దని, ఏవైనా అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తులు కూడా పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు, ఎస్ఐ మోహన్ బాబు సహా పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >
గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
Posted On 2026-04-08 17:28:46
Readmore >
వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం
Posted On 2026-04-08 13:14:54
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్కు తరలింపు
Posted On 2026-04-08 12:27:46
Readmore >