| Daily భారత్
Logo




డబ్బుకు ఆశపడి రెండు నెలల కన్న కొడుకుని విక్రయానికి పెట్టిన కర్కషపు తల్లి

News

Posted on 2025-12-16 05:52:24

Share: Share


డబ్బుకు ఆశపడి రెండు నెలల కన్న కొడుకుని విక్రయానికి పెట్టిన కర్కషపు తల్లి

భర్త పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఫిర్యాదుతో బయటపడ్డ విషయం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నవ మాసాలు కడుపులో మోసిన ఆ తల్లి రెండు నెలల బాబును మధ్యవర్తుల ద్వారా ఓ వ్యక్తికి విక్రయించిన ఘటన జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. నగరంలోని ఎల్లమ్మ గుట్టకు చెందిన శ్రీనివాస్, లక్ష్మీల దంపతుల రెండు నెలల పసికందు ఈ నెల ఐదున ఇంట్లో కనిపించకపోవడంతో బాలుడి తండ్రి శ్రీనివాస్ 4 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈనెల 5న మిస్సింగ్ కేసు కింద ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ ప్రారంభించిన పోలీసులు ఆ రెండు నెలల బాలుడి తల్లి డబ్బుల కోసం ముగ్గురు మధ్యవర్తుల ద్వారా పూనే కు చెందిన విశాల్ అనే వ్యక్తికి రెండున్నర లక్షలకు బాలుడిని విక్రయించడానికి ఒప్పుకున్నట్లు పోలీసుల కథనం ద్వారా తెలుస్తుంది. నిజామాబాద్ కు చెందిన రమాదేవి, మంజుల హైదరాబాద్కు చెందిన విట్టల్ ముగ్గురు కలిసి  లు ఈ ముగ్గురు కలిసి తల్లి లక్ష్మి తో సహా హైదరాబాద్ శివారులో పూణే కు చెందిన విశాల్ కు అప్పచెప్పడానికి ఈ నెల 9న వెళ్లి రెండున్నర లక్షలు తీసుకువచ్చినట్లు సమాచారం. పోలీసులకు సోమవారం నిందితులు దొరకగా తల్లి లక్ష్మిని కోర్టులో హాజరు పరిచినట్లు మిగతా నలుగురు పై కూడా కేసు నమోదు చేసినట్లు నాలుగో టౌన్ ఎస్సై వివరించారు. అయితే పిల్లలు పుట్టడం లేదని పిల్లలు లేరని ఈరోజుల్లో భార్యాభర్తలు  దూరమవుతున్న నేపథ్యంలో కన్నతల్లి ఇలాంటి ఘటన చేయడం బాధాకరం.

Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >
Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >
Image 1

అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!

Posted On 2026-04-08 17:33:40

Readmore >
Image 1

గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.

Posted On 2026-04-08 17:28:46

Readmore >
Image 1

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 న మెగా రక్తదాన శిబిరం

Posted On 2026-04-08 13:16:01

Readmore >
Image 1

వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం

Posted On 2026-04-08 13:14:54

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-04-08 12:27:46

Readmore >