| Daily భారత్
Logo




8 ఏళ్ల బాబును అంగట్లో సరుకుగా విక్రయించిన కసాయపు తల్లిదండ్రులు..

News

Posted on 2025-12-20 18:20:53

Share: Share


8 ఏళ్ల బాబును అంగట్లో సరుకుగా విక్రయించిన కసాయపు తల్లిదండ్రులు..

జిల్లా కేంద్రంలో గత పది రోజుల్లోనే ఇలాంటి వరుస ఘటనలు

వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:8 ఏళ్ల బాబును అంగట్లో సరుకుల కన్న తల్లిదండ్రులే విక్రయించిన ఘటన శనివారం జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. అయితే ఇలాంటి ఘటనే గత పది రోజులలో ఎల్లమ్మ గుట్ట ప్రాంతానికి చెందిన రెండు నెలల పసిబాబుని కన్నతల్లి హైదరాబాద్కు తీసుకువెళ్లి మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఒకరికి విక్రయించేందుకు ప్రయత్నించినా ఘటన మరువకముందే అదే తరహా ఘటన జిల్లా కేంద్రంలో తాజాగా చోటుచేసుకుంది. అసలు జిల్లా కేంద్రంలో అనుమానం ప్రజల్లో కలుగుతుంది. తాజాగా శనివారం నవ  మాసాలు మోసి కని పెంచిన 8 సంవత్సరాల బాబుని విక్రయించారు ఓ తల్లిదండ్రులు. ఆర్థిక పరమైన ఇబ్బందులో లేక బాబు భారమయ్యాడో తెలియదు కానీ లక్ష రూపాయలకు  బాబుని అమ్మేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బాలల సంరక్షణ అధికారులకు తెలియడంతో వన్ టౌన్   పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దార్యాప్తు చేపట్టిన  పోలీసులు బాబును అమ్మేసిన తల్లిదండ్రులతో పాటు కొన్న వారిపై కేసు నమోదు చేశారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం బిక్షటన చేసుకుని జీవనం సాగించే తల్లిదండ్రులు తమ ఎనిమిది సంవత్సరాల బాబును లక్ష రూపాయలకు అమ్మేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఇరు వర్గాల పై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. 8 సంవత్సరాల బాబుని కొన్నవారు  నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వారని తెలిసింది. ఇటీవలే నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు సంవత్సరాల బాబుని రెండు లక్షల నలభై వేల రూపాయలకు తండ్రికి తెలవకుండా  తల్లి అమ్మేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మరువకముందే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ లో  మరో సంఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది.

Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >