Posted on 2025-12-20 18:20:53
జిల్లా కేంద్రంలో గత పది రోజుల్లోనే ఇలాంటి వరుస ఘటనలు
వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:8 ఏళ్ల బాబును అంగట్లో సరుకుల కన్న తల్లిదండ్రులే విక్రయించిన ఘటన శనివారం జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. అయితే ఇలాంటి ఘటనే గత పది రోజులలో ఎల్లమ్మ గుట్ట ప్రాంతానికి చెందిన రెండు నెలల పసిబాబుని కన్నతల్లి హైదరాబాద్కు తీసుకువెళ్లి మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఒకరికి విక్రయించేందుకు ప్రయత్నించినా ఘటన మరువకముందే అదే తరహా ఘటన జిల్లా కేంద్రంలో తాజాగా చోటుచేసుకుంది. అసలు జిల్లా కేంద్రంలో అనుమానం ప్రజల్లో కలుగుతుంది. తాజాగా శనివారం నవ మాసాలు మోసి కని పెంచిన 8 సంవత్సరాల బాబుని విక్రయించారు ఓ తల్లిదండ్రులు. ఆర్థిక పరమైన ఇబ్బందులో లేక బాబు భారమయ్యాడో తెలియదు కానీ లక్ష రూపాయలకు బాబుని అమ్మేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బాలల సంరక్షణ అధికారులకు తెలియడంతో వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దార్యాప్తు చేపట్టిన పోలీసులు బాబును అమ్మేసిన తల్లిదండ్రులతో పాటు కొన్న వారిపై కేసు నమోదు చేశారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం బిక్షటన చేసుకుని జీవనం సాగించే తల్లిదండ్రులు తమ ఎనిమిది సంవత్సరాల బాబును లక్ష రూపాయలకు అమ్మేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఇరు వర్గాల పై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. 8 సంవత్సరాల బాబుని కొన్నవారు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వారని తెలిసింది. ఇటీవలే నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు సంవత్సరాల బాబుని రెండు లక్షల నలభై వేల రూపాయలకు తండ్రికి తెలవకుండా తల్లి అమ్మేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మరువకముందే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ లో మరో సంఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది.
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >