Posted on 2025-12-28 14:20:11
మానవత్వం మంటగలిచిన వేళ..!
నవ మాసాలు కడుపులో మోసి జన్మనిచ్చిన పసిబిడ్డను గోదారమ్మ కాల గర్భంలో తోసేసిన కర్కషపు తల్లి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లాలో ఓ తల్లి కర్కశంగా వ్యవహరించింది. నవమాసాలు మోసి కన్నబిడ్డను గోదారమ్మ సాక్షిగా కాలగర్భంలో కలిపేసింది. నవీపేట్ మండలం యంచ గ్రామ పరిధిలోని గోదావరి నదిలో స్థానికులు పసికందు మృతదేహాన్ని గుర్తించారు. సంతానం లేక ఎంతోమంది బాధపడుతున్న ఈరోజుల్లో ఓ తల్లి ఇలా చేయడం స్థానికులను కలచివేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ మధ్యకాలంలో జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ నవ మాసాలు కనీ జన్మనిచ్చిన పసిపిల్లల పట్ల తల్లిదండ్రులు వారి బిడ్డలను డబ్బు కోసమో, ఏ ఇతర కారణాల కోసమో వదిలించుకోవడం చూస్తుంటే మానవత్వం ఎంతగా మంటగలుస్తుందో ఈ ఘటనబట్టే అర్థమవుతుంది.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >