Posted on 2026-01-10 11:58:29
వృద్ధులు–వికలాంగుల ఆశ్రమానికి బైక్ ర్యాలీ, దుప్పట్లు–దుస్తుల పంపిణీ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టాటా రతన్ చేసిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శం అని మరోసారి చాటిచెప్పింది టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ. కొత్తగూడెం టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ జక్కుల సతీష్ ఆధ్వర్యంలో ఈరోజు గణేష్ టెంపుల్ పరిధిలోని మెయిన్ బ్రాంచ్ నుంచి హెడ్ ఆఫీస్ పరిధిలో ఉన్న బర్మా క్యాంప్ లోని శ్రీ జ్యోతి వృద్ధులు మరియు వికలాంగుల అనాథాశ్రమం వరకు ద్విచక్ర వాహనాలపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా టాటా రతన్ సమాజ సేవలు, మానవత్వ విలువలు గురించి ప్రజలకు వివరిస్తూ ఆశ్రమం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం శీతాకాలంలో చలితో ఇబ్బంది పడుతున్న వృద్ధులు, వికలాంగులకు దుప్పట్లు (రగ్గులు) మరియు దుస్తులు పంపిణీ చేశారు.
అనంతరం ఆశ్రమంలోని వృద్ధులు, వికలాంగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న టాటా ఏఐఏ బ్రాంచ్ మేనేజర్ జక్కుల సతీష్ మాట్లాడుతూ,
“మీకు ఆరోగ్య పరంగా ఏ సమస్య వచ్చినా తక్షణమే మేము అండగా ఉంటాం” అని భరోసా ఇచ్చారు.
ఇదే సందర్భంగా వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి నెల రూ.2000 చొప్పున తాను ఉన్నంతవరకు అందజేస్తానని జక్కుల సతీష్ ప్రకటించారు. అలాగే లీగల్ అడ్వైజర్ కొచ్చర్ల కమల రాణి మాట్లాడుతూ, వృద్ధుల ఆరోగ్య అవసరాల కోసం ప్రతి నెల రూ.1000 అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొర్ర రాములు,జరుపుల సుధాకర్, కొచ్చెర్ల కమలారాణి, శివప్రసాద్, మహేష్ వాంకుడోత్,దేవరం జాడి సుమన్ నాగేంద్ర రెడ్డి,విజయ్ కావేటి వాంకుడోత్ సురేష్ అడపా దివ్య శివలీలా వరాల వీరన్న ఈ కార్యక్రమం సేవాభావం, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందని స్థానికులు అభినందనలు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >