Posted on 2026-01-10 20:12:36
పబ్లిక్ అండ్ హెల్త్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి కొరకై అభివృద్ధి పనుల కోసం జరుగుతున్న పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించద్దని పబ్లిక్ అండ్ హెల్త్ అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల్లో భాగంగా ప్రజలకు భవిష్యత్తులో యూజీడి పనుల వల్ల మ్యాన్ హోల్స్ పనుల ఏర్పాటులో ప్రతిష్టాత్మకంగా ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి తావివ్వకుండా పనులు చేపట్టాలని నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో వాటర్ వర్క్స్, నీటి ట్యాంకుల పనుల కు సంబంధించి నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన అన్ని నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేసి త్వరత కట్టిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పనుల్లో ఏమాత్రం రాజీ పడకుండా అన్ని పనులు నాణ్యతతో చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా పనులు చేస్తే తాను సహించ చేయించబోనని ఆయన స్పష్టం చేశారు. అలాగే టి యు ఎఫ్ ఐ డి సి ఫండ్ కింద అరవై కోట్లు మంజూరయ్యాయని, అందులో ప్రతి డివిజన్ కు ఒక కోటి రూపాయల చొప్పున అభివృద్ధి, మరమ్మత్తుల పనుల కోసం టెండర్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి నాణ్యమైన సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలు, కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. రామర్తి చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేసి, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా అవసరాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని కాంట్రాక్టర్లు, అందుకు సంబంధించిన అధికారులు బాధ్యతాయుతంగా, చిత్తశుద్ధితో పనులు పూర్తి చేయాలని అధికారులను సుతి మెత్తగా మందలించారు. నగర అభివృద్దే తన లక్ష్యమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, ఇన్చార్జి మున్సిపల్ ఈ ఈ నగేష్ రెడ్డి పబ్లిక్ హెల్త్ ఏ ఈ శంకర్ సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >