Posted on 2026-01-10 18:27:46
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తిరుమలలోని ఏడుకొండలు కేవలం భౌగోళిక పర్వతాలు మాత్రమే కాదు… అవి ఆధ్యాత్మిక ఎదుగుదలకి ప్రతీకలు. ఈ ఏడుకొండలు దాటడం అంటే మన అంతరంగంలోని ఏడు చక్రాలను అధిగమించడం.
ఆ తర్వాత లభించేది – ఆనందానుభూతి. ఆ ఆనంద నిలయం బ్రహ్మస్థానంలో ఉంటుంది. అందుకే స్వామి ఏడుకొండల పై వెలసి ఉన్నాడు.
తిరుమల ఏడుకొండల పేర్లు*
1. నీలాద్రి
2. వృషభాద్రి
3. గరుడాద్రి
4. అంజనాద్రి
5. శేషాద్రి
6. వేంకటాద్రి
7. నారాయణాద్రి
ఈ ఏడుకొండలు సాలగ్రామ స్వరూపాలు, మహర్షులే స్వయంగా పర్వతాలుగా అవతరించిన రూపాలు అని పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలోని చెట్లు, పుట్టలు, పక్షులు కూడా మహర్షుల అంశలేనని నమ్మకం. అందుకే తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.
శ్లోక మహిమ
ఈ క్షేత్రానికి సంబంధించిన 20 నామాలను పఠిస్తే సర్వపాప బంధ విముక్తి కలుగుతుందని శాస్త్రవచనం*
అంజనాద్రి వృషాద్రిశ్చ శేషాద్రిర్గరుడాచలః…
వైకుంఠాద్రి పుష్కరాద్రిః – ఇతి నామాని వింశతిః
ఏడుకొండల అంతరార్థం
1️⃣ నీలాద్రి
స్వామివారికి తొలిసారి తలనీలాలు సమర్పించిన నీలాంబరి పేరుమీద ఈ కొండకు నామకరణం జరిగింది.
✓ తలనీలాల సమర్పణ = అహంకార విసర్జన.
2️⃣ వృషభాద్రి
వృషభుడు (ఎద్దు) వేద ప్రమాణానికి సంకేతం. వేదమే ప్రమాణమని అంగీకరించినవాడే ఈ కొండ ఎక్కగలడు.
వృషభాసురుడి పురాణగాథ ఈ కొండ మహిమను చాటుతుంది.
3️⃣ గరుడాద్రి
గరుడుడు చేసిన తపస్సుకు ఫలితంగా ఈ కొండ ఏర్పడింది.
✓ ఉపనిషత్తుల జ్ఞానంతో భగవంతుడిని తెలుసుకోవడమే గరుడాద్రి భావం.
4️⃣ అంజనాద్రి
“అంజనం” అంటే కంటికి కాటుక.
✓ చూసే ప్రతిదానిలో బ్రహ్మాన్ని దర్శించడం – ఇదే అంజనాద్రి తత్త్వం.
అంజనాదేవి తపస్సు ఫలితంగా హనుమంతుడు జన్మించాడు.
5️⃣ శేషాద్రి
అంతా బ్రహ్మమే అని అనుభవంలో తెలిసిన స్థితి.
రాగద్వేషాలు లేని, భయం లేని సమత్వ స్థితి.
సప్తగిరుల్లో ప్రధానమైన కొండ – శేషాద్రి.
6️⃣ వేంకటాద్రి
వేం = పాపం | కట = హరించుట
✓ స్వామి సమక్షంలో సర్వపాప నాశనం.
కలియుగ దైవం వెలసిన పవిత్ర గిరి. మాధవుడి కథ ఈ కొండ మహిమకు నిదర్శనం.
7️⃣ నారాయణాద్రి
తుల్యావస్థను కూడా దాటి తానే బ్రహ్మమై నిలిచే స్థితి.
నారాయణ మహర్షి తపస్సు చేసిన పర్వతం కావున ఈ నామం స్థిరపడింది.
✓ సారాంశం
తిరుమల ఏడుకొండలు ఎక్కడం అంటే…
✓ శరీర ప్రయాణం కాదు
✓ ఆత్మ ప్రయాణం
✓ అహంకారం నుంచి ఆనందం వైపు సాగే మార్గం
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >
గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
Posted On 2026-04-08 17:28:46
Readmore >
వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం
Posted On 2026-04-08 13:14:54
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్కు తరలింపు
Posted On 2026-04-08 12:27:46
Readmore >