Posted on 2026-01-13 11:27:26
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం ఓ యువకుడి ప్రాణం తీసింది. గత కొద్ది రోజుల జిల్లాలోని రూరల్ నియోజకవర్గం పరిధిలో ఓ యువకుడు బెట్టింగ్ యాప్ లకు బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మరువకముందే అలాంటి ఘటన తాజాగా నిజామాబాద్ జిల్లా లో చోటు చేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి రెంజల్ మండలం కూనెపల్లి గ్రామానికి చెందిన పెరుమండ్ల సంజయ్ (28) గత కొంతకాలంగా బెట్టింగ్లకు బానిసై భారీగా అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక, అదనపు డబ్బు కోసం తల్లిదండ్రులను వేధించేవాడు. ఉన్నకాస్తా పోవడంతో మనస్తాపానికి గురైన సంజయ్.. మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేతికి అందిన కొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాదం నిండింది.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >