Posted on 2026-01-16 19:08:48
భయాందోళనలకు గురవుతున్న ప్రజలు
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోతులు అడవులను వదిలి జన సంద్రాలోకి వచ్చి ఇండ్లలోకి గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాటు, ఆర్మూర్, వర్ని మండలాలతో పాటు పలు గ్రామాలలో వానర సైన్యం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా బయట తిరగాలంటేనే కోతులు ఎక్కడ మీద పడి గాయపరుస్తాయోనని భయంతో జీవిస్తున్నారు. అటు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో కోతులు గుంపులుగా చేరి వీరవిహారం చేస్తున్నాయి. విపరీతంగా కొట్లాడుకుంటూ రోడ్లపైకి వస్తుండటంతో వృద్ధులు, చిన్నారులు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇళ్లపైకి దూకుతూ నిత్యావసరాలను ఎత్తుకెళ్తున్నాయని, బాటసారులపై దాడులకు దిగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. కోతుల బెడదతో నిత్యం భయం గుప్పిట్లో బతుకుతున్నామని, ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి వాటిని బంధించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >