Posted on 2026-01-18 19:54:05
విజేతగా నిలిచిన ఏ టీం.
డైలీ భారత్, నిజామాబాద్: నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం నగరంలో పాలిటెక్నిక్ క్రీడ మైదానంలో క్రికెట్ మ్యాచ్ పోటీలు నిర్వహించారు. ప్రెస్ క్లబ్ క్రికెట్ మ్యాచ్ లో ఏ బి సి మూడు టీములుగా బరిలోకి నిలిచాయి. ఏ టీం కెప్టెన్ శివ ఠాకూర్, బి టీం కెప్టెన్ శ్యాంసుందర్, సి టీం కెప్టెన్ గా వంగరి శ్రీనివాస్ లు టీం కి కెప్టెన్ గా ప్రాతినిధ్యం వహించారు. ఏ బి సి టీములను ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ డ్రా పద్ధతి ద్వారా క్రికెట్ మ్యాచ్లను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పంచర్ రెడ్డి శ్రీకాంత్, సుభాష్ వాగ్మా రేలు మాట్లాడుతూ నిత్యం వివిధ వార్తాస్యకరణలో క్షణం కూడా తీరిక లేకుండా ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం వేల జర్నలిస్టులకు మానస ఉల్లాసం పెంపొండడానికి, జర్నలిస్టులో ఒత్తిడిని జయించడానికి ఇలాంటి క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు. ఓడిపోయిన వారు నిరాశ చెందకుండా ఓటమి గెలుపుకు నాందిగా భావించాలని ఆయన అన్నారు. మొత్తం మీద శనివారం నిర్వహించిన జర్నలిస్టు క్రీడాకారులు అందరూ ఆనందోత్సవాల మధ్య ఎంతో సంతోషంగా క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఒక క్రికెట్ మ్యాచ్ క్రీడల్లోనే కాకుండా వృత్తిపరంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిజామాబాద్ ప్రెస్ క్లబ్ పక్షాన నిలబడతామన్నారు. ఈ క్రీడా స్ఫూర్తితోనే మునుముందు మన మన ముందున్న సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొందామని వారు పిలుపునిచ్చారు. బి / సి టీములు లక్కీ డ్రా లోగా తీయగా, ఏ టీం బైలా బి టాస్ గెలిచింది బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి క్రికెట్ మ్యాచ్ లో వంగరి శ్రీనివాస్ టీమ్ తో శ్యాంసుందర్ టీం తలపడగా మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్న శ్యాంసుందర్ టీం బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత 12 ఓవర్లో 134 పరుగులు చేసింది.
అనంతరం వంగరి శ్రీనివాస్ టీం రెండవ ఇన్నింగ్స్ లో కెప్టెన్ వంగరి శ్రీనివాస్, రాజకుమార్ లు అత్యుత్తమ బ్యాటింగ్ ప్రతిభ కనబరిచి 34 రన్నులతో రాజ్ కుమార్ 39 రన్నులు చేసి బెస్ట్ పార్ట్నర్ షిప్ గా నిలిచారు. బ్యాటింగ్ చేసి శ్రీనివాస్ బ్యాటింగ్ చేసి నాలుగు వికెట్లను కోల్పోయి 121 పరుగులు చేసింది. 14 రన్నులతో శ్యాంసుందర్ టీం విజయం సాధించింది. అనంతరం ఓడిన సి టీం మరియు బై లో ఉన్న ఏ టీం రెండో మ్యాచ్ కు టాస్ వెయ్యగా ఏ టీం ఎంచుకుంది. ఏటీఎం 12 ఓవర్లలో 139/2 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన షీ టీం 12 ఓవర్లలో 89 పరుగులు తో 7 వికెట్లు 50 పరుగుల నష్టానికి...ఏ టీం విజయం సాధించింది.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >