Posted on 2026-01-19 17:36:36
శాంతి మార్గమే శరణ్యం
యుద్ధంపై విద్యార్థి అభిమన్యు ప్రాజెక్టును ప్రశంసించిన జిల్లా ఎస్పీ
యుద్ధం వద్దు.. శాంతి ముద్దు
ఏడవ తరగతి విద్యార్థి అభిమన్యు ఆశయం!
డైలీ భారత్, కామారెడ్డి:మాచారెడ్డి మండలం మర్రి తండాకు చెందిన సబావత్ సదర్ నాయక్ కుమారుడు అభిమన్యు, ప్రస్తుతం కొంపల్లి శ్రీ చైతన్య పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. లోకం నలుమూలల జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఈ చిన్నారి మనస్సు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం సృష్టిస్తున్న విధ్వంసాన్ని చూసి చలించిపోయింది. ఎక్కడో జరుగుతున్న యుద్ధం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం, లక్షలాది మంది నిరాశ్రయులవ్వడం ఆ బాలుడిని తీవ్రంగా ఆలోచింపజేసింది.
ఇదే విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనే ఉద్దేశంతో అభిమన్యు మనుషుల మనసుని సైతం కరిగించే ప్రాజెక్టును కళ్లకు కట్టినట్లుగా సిద్ధం చేశాడు. యుద్ధం వల్ల కలిగే నష్టాలను, ప్రపంచానికి శాంతి ఎంత అవసరమో వివరిస్తూ తను రూపొందించిన ఆ ప్రాజెక్టును తన తండ్రి సదర్ నాయక్ తో కలిసి జిల్లా ఎస్పీ కి వివరించాడు.
చిన్న వయసులోనే ప్రపంచ శాంతి పట్ల అభిమన్యు చూపిస్తున్న తపనను చూసి జిల్లా ఎస్పీ గారు. ముగ్ధులయ్యారు. బాలుడు సిద్ధం చేసిన ప్రాజెక్టును ఆసక్తిగా పరిశీలించి, అతని మాటలను ఎంతో శ్రద్ధగా విన్న ఎస్పీ, "నీ ఆలోచనలు సమాజానికి ఒక దిక్సూచి వంటివి" అంటూ మనస్ఫూర్తిగా అభినందించారు. అనంతరం అభిమన్యు ముద్దుగా అడిగిన ఆటోగ్రాఫ్ విన్నపాన్ని మన్నిస్తూ ఎస్పీ సంతకం చేసి ఆ బాలుడిని ప్రోత్సహించారు. యుద్ధంపై ఆవేదనతో మొదలై, ఉన్నతాధికారి అభినందనల వరకు సాగిన అభిమన్యు ప్రయాణం ప్రస్తుతం అందరికీ స్ఫూర్తినిస్తోంది.
#YoungVisionary #PeaceMessenger #Kamareddy #PolicePride #PeaceNotWar
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >