Posted on 2026-01-19 17:47:10
"ప్రణాళిక బద్ధమైన చదువు విజయానికి మార్గం" అంశంపై మానసిక అవగాహన సదస్సు
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మండలం గర్గుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో "ప్రణాళిక బద్ధమైన చదువు విజయానికి మార్గం" అనే అంశంపై విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన సదస్సు నిర్వహించినట్లు ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా మానసిక వైద్యాధికారి డాక్టర్ రమణ మాట్లాడుతూ.. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే దేనినైనా జయించగలమని ఉద్ఘాటించారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు ప్రణాళిక వేసుకొని చదువుకోవాలని, సందేహాలు ఏమైనా ఉంటే తమ ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు. పరీక్షా కాలంలో విద్యార్థులకు ఏర్పడే మానసిక సమస్యలు, టీనేజీలో వచ్చే అవరోధాలను అధిగమించేందుకు విద్యార్థులతో చర్చించారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని అటువంటిప్పుడే విద్యార్థులు చదువుపై ఇష్టంతో మార్కులు సంపాదిస్తారన్నారు. మార్కులు తక్కువ వచ్చాయని ఫెయిల్ అయ్యా మను మానసిక చింతను దరిచేరనీయరాదని, ఎటువంటి మానసిక సమస్యలు తలెత్తిన తమను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఎక్సైజ్ ఎస్సై విక్రం కుమార్ మాట్లాడుతూ.. టీనేజ్లో విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసవ్వడం గత కొంతకాలంగా చూస్తున్నట్లు ఇప్పుడు కాకపోయినా రానున్న రోజుల్లో విద్యార్థులు చెడు వ్యసనాలకు దగ్గరయ్యే అవకాశం ఉండడంతో వాటి జోలికి వెళ్లకుండా ఉండేందుకు, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలను విద్యార్థులకు వివరించారు. తమ ఇళ్లల్లో కానీ తమ చుట్టుపక్కల ఇళ్లల్లో కానీ గ్రామాల్లో మత్తు పదార్థాలు ఎవరైనా వినియోగించిన కలిగి ఉన్న తమకు సమాచారాన్ని చేరవేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి క్రమశిక్షణాహితంగా ఉంటూ విజయాలను సొంతం చేసుకోవాలని సూచించారు. మానసిక సమస్యలు తలెత్తితే 14416ని, డ్రగ్స్ సంబంధిత సమాచారం తెలిస్తే 14446 ని సంప్రదించాలని తమ వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా సోషల్ వర్కర్ డా.రాహుల్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >