| Daily భారత్
Logo




ఎస్సీ డివిజన్ లపై హైకోర్టు లో బిజెపి పార్టీ వేసిన పిటీషన్ ను వెనక్కి తీసుకోవాలి

News

Posted on 2026-01-21 21:27:28

Share: Share


ఎస్సీ డివిజన్ లపై హైకోర్టు లో బిజెపి పార్టీ వేసిన పిటీషన్ ను వెనక్కి తీసుకోవాలి

ఎస్సీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్.

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎస్సీ డివిజన్లపై హైకోర్టులో బిజెపి పార్టీ  వేసిన పిటిషన్ ను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని ఎస్సీ సంఘాల ఐక్యవేదిక బుధవారం డిమాండ్ చేసింది. ఇలా హైకోర్టులో పిటిషన్ వేయడం ఆ పార్టీకి సిగ్గుచేటు అని ఎస్సీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎస్సీ లందరూ ఐక్యంగా ఉండి బిజెపి పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఎస్సీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రెస్ క్లబ్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ చౌరస్తాలో బిజెపి దిష్టిబొమ్మ ను దహనం చేశారు.

ఈ సందర్భంగా ఎస్సీ సంఘాల ఐక్యవేదిక నాయకులు పులి జైపాల్, మల్యాల గోవర్ధన్, బంగారు సాయిలు, షేక్ హుస్సేన్, మల్లని శివ మాదిగ తదితరులు మాట్లాడుతూ ఎస్సీల పట్ల బిజెపి వైఖరి మరో మారు బయటపడిందన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేవలం ఎస్సీ డివిజన్ లు 39, 40, 44 లలో  రిజర్వేషన్లను సవాలు చేస్తూ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి  పోతన్కర్ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం పట్ల దళితుల పట్ల బిజెపి వైఖరి మరో మారు బయటపడిందని అన్నారు. 60 డివిజన్ లలో రిజర్వేషన్లపై పిటిషన్ వేయాల్సిన వారు, వారి రాజకీయ లబ్ధి కోసం కేవలం ఎస్సీ డివిజన్ల పై వేసి ఎస్సీలను రాజకీయ బలి పశువులుగా చేస్తున్నారని అన్నారు, ఎస్సీల జోలికి వస్తే బిజెపి కి తగిన గుణపాఠం చెబుతామని అన్నారు, నిజామాబాద్ నగరంలోని ఎస్సీలు బిజెపి పార్టీ మన పట్ల వ్యవహరిస్తున్న తీరును పసిగట్టి బిజెపి అభ్యర్థులను రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని వారిని ఓడించడమే మన ఐక్యతకు నిదర్శనం అని పిలుపునిచ్చారు. ఈ వైఖరికి నిరసనగా రాబోయే కాలంలో మరిన్ని ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో టిఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ, మహిళా నాయకులు బంటు జ్యోతి, మాల మహానాడు నాయకులు వినయ్, దండు చంద్రశేఖర్, నీలగిరి రాజు, చందు, చంద్రకాంత్, రాజయ్య, భీమ్ ఆర్మీ అధ్యక్షులు అజయ్, జమాతే ఇస్లామీ హింద్ నాయకులు హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >
Image 1

అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

Posted On 2026-04-28 07:33:42

Readmore >
Image 1

అక్రిడేషన్ కమిటీపై అనుమానాలు

Posted On 2026-04-27 22:06:35

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-27 22:00:34

Readmore >
Image 1

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్

Posted On 2026-04-27 21:45:44

Readmore >
Image 1

ఉపముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గుండెపోటుతో మృతి

Posted On 2026-04-27 20:37:27

Readmore >
Image 1

గణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-04-27 19:31:59

Readmore >
Image 1

జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి

Posted On 2026-04-27 19:27:31

Readmore >