Posted on 2026-01-22 12:15:58
పట్టణ అభివృద్ధి కోసం సహకరించండి..
AIMIM పార్టీలో భారీ చేరిక
డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో AIMIM పార్టీ బరిలో ఉంటుందని AIMIM నాయకులు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో AIMIM పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. AIMIM పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో కామారెడ్డి నుంచి యువ నేతలు సయ్యద్ ఇమ్రోజ్,అహ్మద్, మహమ్మద్ ముసైబ్ ఖాన్ తో ఆయా వార్డుల నాయకులు భారీ సంఖ్యలో చేరారు.పాలకుల నిర్లక్ష్యం వల్ల కామారెడ్డిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. అభివృద్ధి కోసం పట్టణ ప్రజలు AIMIM పార్టీని గెలిపించే విధంగా సహకరించాలని కోరారు. కామారెడ్డి పట్టణం నుంచి భారీ సంఖ్యలో AIMIM పార్టీలో చేరడం చాలా సంతోషకరమన్నారు. ఈ సమావేశంలో AIMIM పట్టణ అధ్యక్షుడు నయీమ్ హస్సేన్ జాఫర్ ఖాన్, మహమ్మద్ ఉబేద్ అలీ, నాయకులు రాశేద్ ఖాన్, ముష్షు, గులాం మొహమ్మద్, సాజిద్, జలీల్,పాల్గొన్నారు.కొత్తగా పార్టీలో చేరిన వారు సయ్యద్ ఇమ్రోజ్ అహ్మద్ టీం , 48 వ వార్డు ఇంచార్జ్ ముసేబ్ ఖాన్ ఖాన్ టీం 4వ వార్డ్ ఇంచార్జ్ వేముల సత్యం, మహమ్మద్ అఫ్జల్ , సల్మాన్ రాజ, సయ్యద్ మొయినుద్దీన్, అబ్దుల్ మోకిత్, సయ్యద్ అలీ పాషా , మహమ్మద్ అమీర్ తదితరులు యువకులు పార్టీలో చేరారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >