Posted on 2026-01-22 14:59:51
డైలీ భారత్, తెలంగాణ డెస్క్:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
యూనివర్సిటీ అధికారులు, ప్రొఫెసర్లు, సిబ్బందితో పాటు విద్యార్థులతో కలిసి తీన్మార్ మల్లన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన శ్రద్ధగా విన్నారు. ముఖ్యంగా విద్యార్థులు తమ విద్యా సంబంధిత సమస్యలు, మౌలిక వసతుల లోపం, హాస్టళ్లలో సదుపాయాల కొరత, ప్రయోగశాలల్లో ఆధునిక పరికరాల లేమి, పరిశోధనలకు తగిన నిధులు అందకపోవడం వంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
అలాగే ప్రొఫెసర్లు, అధ్యాపకులు తమ సేవా సమస్యలను మల్లన్నకు వివరించారు. పదోన్నతులు నిలిచిపోవడం, ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడం, ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులకు ఉద్యోగ భద్రత లేకపోవడం, పరిశోధనలకు ప్రభుత్వ మద్దతు తగ్గడం, యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించకపోవడం వంటి సమస్యలను వారు ప్రస్తావించారు.
విద్యార్థులు, ప్రొఫెసర్లు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని శ్రద్ధగా విన్న తీన్మార్ మల్లన్న, వ్యవసాయ విద్యా వ్యవస్థ బలోపేతం లేకుండా రైతాంగానికి న్యాయం జరగదని అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు రైతుల భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులు, ప్రొఫెసర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే బాధ్యత తనదేనని మల్లన్న భరోసా ఇచ్చారు. విద్య, పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు.
రైతు, వ్యవసాయం, వ్యవసాయ విద్యకు ప్రాధాన్యం ఇచ్చే విధానాల ద్వారానే తెలంగాణలో వ్యవసాయ రంగానికి నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >