Posted on 2026-01-22 15:00:58
జడల కుటుంబానికి మాజీ ఎంపీ నామ పరామర్శ
డైలీ భారత్, ఖమ్మం: తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని బీఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కారేపల్లి మండల నివాసి జడల వెంకటేశ్వర్లు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా గురువారం నాడు మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు కారేపల్లి లోని వారి నివాసానికి వెళ్లి వారి సతీమణి మాజీ ఎంపీటీసీ జడల వసంత, కుమారుడు జడల కళ్యాణ్ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అధైర్యపడొద్దు అండగా ఉంటామన్నారు. ఆయనతో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారు మన మధ్య లేకపోవటం పార్టీకి తీరని లోటని మాజీ ఎంపీ నామ పేర్కొన్నారు. నామ వెంట బీఆర్ఎస్ నాయకులు మోరంపూడి ప్రసాద్ రావు, గొడ్డేటి మాధవరావు, వాకదాని కోటేశ్వరరావు లతో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >