| Daily భారత్
Logo




ఇందూరు గడ్డపై కమల వికాసం తథ్యం

News

Posted on 2026-01-22 20:08:32

Share: Share


ఇందూరు గడ్డపై కమల వికాసం తథ్యం

కేంద్ర పథకాలతో సోకులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్లో కమలం వికసిస్తుందని ఇందూరు గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. గురువారం కార్పొరేషన్ పరిధిలోని 43, 52, 28, 51, 14 మరియు 15వ డివిజన్ లలో కోటి రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత భారతదేశం తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ప్రపంచం లోని అనేక దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఆర్థికంగా చతికిలబడిపోయాయని, ఆ దేశాల్లో జీవిస్తున్న ప్రజల ప్రాణాలకు రక్షణ కూడా లేకుండా పోయిందని అన్నారు. మోడీ నాయకత్వంలో ఉన్న భారతదేశం తిరుగులేని శక్తిగా విశ్వగురువుగా ఎదుగుతుందన్నారు. ప్రధాని మోదీ పాలనలో దేశభక్తి ఆధ్యాత్మిక చింతన సనాతన ధర్మం రోజురోజుకు పెరుగుతున్నాయని భారతీయులంతా బిజెపి వైపు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి సాధించిన తిరుగులేని విజయమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం, ఇంటింటికి మంచినీరు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు ఇలా ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని, కానీ అంతా తామే చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం వింతగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎఎస్ పార్టీలు రెండూ కూడా కుటుంబ పార్టీలేనని, నిజమైన ప్రజాస్వామ్యంతో నడిచే బిజెపి పార్టీ మాత్రమే సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్ అనే నినాదాలతో పనిచేస్తుందని అన్నారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించినప్పటికీ కేవలం రెండు, మూడు సీట్ల తేడాతో కార్పొరేషన్ సీటు కోల్పోయామని, అనైతిక హక్కులతో మేయర్ పీఠం దక్కించుకున్న ఎంఐఎం, బీఆర్ఎస్ ప్రభుత్వం నగరానికి చేసిందేమీ లేదని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపి తిరుగులేని విజయం సాధించి మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని, నగరాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలలో పబ్లిక్ హెల్త్ ఏఈ శంకర్ పాల్గొన్నారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >