Posted on 2026-01-22 20:10:27
డైలీ భారత్, రామంతపూర్:రామంతపూర్ డివిజన్ పరిధిలోని వెంకట్ సాయి నగర్లో నూతనంగా కల్వర్టు నిర్మాణ పనులను రానున్న రెండు–మూడు రోజుల్లో ప్రారంభించనున్నట్లు కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు తెలిపారు.
గత నెలలో రూ.34 లక్షల 50 వేల వ్యయంతో కల్వర్టు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరైనప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల పనులు ప్రారంభించలేకపోయామని, ఆ సమస్యలు పరిష్కారమైందున త్వరలోనే పనులు మొదలుపెట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, కాలనీ వాసుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో కల్వర్టు నిర్మాణానికి కూడా త్వరలోనే అనుమతులు తీసుకొని పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డి ఈ వినీల్ గౌడ్, ఏఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్, బీజేపీ మహిళా నాయకురాలు కీర్తి ముదిరాజ్తో పాటు ఇతరులు పాల్గొన్నారు
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >