Posted on 2026-01-22 20:30:45
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేబీ ఆర్ట్ & చిల్డ్రన్స్ క్లినికల్ నూతన హాస్పిటల్ను ఈరోజు ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు జాటోత్ రామచంద్రనాయక్ ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాటోత్ రామచంద్రనాయక్ మాట్లాడుతూ, చిన్నారులకు మరియు సాధారణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో ఈ హాస్పిటల్ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తుందని తెలిపారు.
ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ప్రైవేట్ వైద్య సంస్థలు కూడా సామాజిక బాధ్యతతో ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించాలని హాస్పిటల్ నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నిర్వాహకులు, వైద్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >