| Daily భారత్
Logo




వరుస దొంగతనాల కేసుల ఛేదన

News

Posted on 2026-01-23 18:44:28

Share: Share


వరుస దొంగతనాల కేసుల ఛేదన

నరసన్నపేట సర్కిల్ పరిధిలో వరుస దొంగతనాల కేసుల ఛేదన

ముగ్గురు నిందితుల అరెస్ట్

రూ.35 లక్షల విలువైన ఆస్తి స్వాధీనం

డైలీ భారత్, శ్రీకాకుళం: నరసన్నపేట సర్కిల్ పరిధిలోని జలుమూరు, సారవకోట, నరసన్నపేట, పోలాకి పోలీస్ స్టేషన్ పరిధిలో గల నగిరికటకం, జలుమూరు, సవిగారం, అల్లాడ, శ్రీముఖలింగం, కూన లచ్చుము నాయుడుపేట, బుడితి, కోమర్తి, తలసముద్రం తదితర గ్రామాలలో జరిగిన వరుస దొంగతనాల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కేసు ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు అని అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు తెలిపారు.

కేసు వివరాలను శుక్రవారం నరసన్నపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో అదనపు ఎస్పీ పి. శ్రీనివాసరావు వెల్లడించారు.

 అరెస్ట్ అయిన నిందితులు:

A-1: చల్ల అచ్చుత రావు, S/o లేట్ సత్యనారాయణ, వయస్సు 35 సం., వెలమ కులం, గంగన్నపేట గ్రామం, అండవరాం పంచాయతీ, జలుమూరు మండలం.

A-2: పొన్నాన యోగేశ్వర రావు, S/o లేట్ తవుడు, వయస్సు 22 సం., వెలమ కులం, మాకివలస గ్రామం, జలుమూరు మండలం.

A-3: అల్లు నరేంద్ర కుమార్, S/o గోవిందరావు, వయస్సు 18 సం., వెలమ కులం, మాకివలస గ్రామం, జలుమూరు మండలం.

స్వాధీనం చేసుకున్న ఆస్తి (సుమారు రూ.35,00,000/- విలువ):

బంగారం : 31 తులాలు (సుమారు 373 గ్రాములు)

వెండి : 800 గ్రాములు

హోమ్ థియేటర్ : 01

డీజే సిస్టమ్ యాంప్లిఫైయర్ : 01

నేరానికి ఉపయోగించిన మహేంద్ర థార్ వాహనం (నెంబర్: PY 05 P 0017)

ఇన్వర్టర్ బ్యాటరీ.

వీరు ఈ క్రింది ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడ్డారు:

నగిరికటకం,జలుమూరు,కూన లచ్చుము నాయుడుపేట, కొమర్తి,బుడితి గ్రామం, బద్రి రోడ్డు,తలసముద్రం, అల్లాడ గ్రామం, మర్రివలస గ్రామం,బుడితి జంక్షన్,సైరిగాం గ్రామం,శ్రీముఖలింగం గ్రామం లలో నేరాలు పాల్పడ్డారు.

కేసు పూర్తి వివరాలు:

A-1 చల్ల అచ్చుత రావు SRK సప్లయర్స్ యజమానిగా ఉండగా, A-2 మరియు A-3 అతని వద్ద పనిచేస్తున్నారు. వ్యసనాలకు బానిసలైన వీరు గ్రామాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, రాత్రి సమయాల్లో టెంట్‌లకు ఉపయోగించే ఇనుప హుక్స్ సహాయంతో తాళాలు విరగగొట్టి దొంగతనాలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ దినం ఉదయం జలుమూరు మండలం కొమనపల్లి జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ జరుగుతున్న సమయంలో, బంగారాన్ని అమ్మేందుకు మహేంద్ర థార్ వాహనంలో వెళ్తున్న నిందితులను పోలీసులు పట్టుకొని, వారి వద్ద నుండి దొంగ సొత్తు మరియు నేరానికి ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసునుటెక్కలి సబ్ డివిజన్ పోలీస్ అధికారి శ్రీ డి. లక్ష్మణరావు గారి పర్యవేక్షణలో, నరసన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం. శ్రీనివాసరావు గారు, జలుమూరు ఎస్‌.ఐ. బి. అశోక్ బాబు, పోలాకి ఎస్‌.ఐ. జి. రంజిత్, సారవకోట ఎస్‌.ఐ. బి. అనిల్ కుమార్, నరసన్నపేట ఎస్‌.ఐ. శేఖర్ రావు గార్ల బృందం సమర్థవంతంగా ఛేదినలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎం. ధర్మరాజు, ఎం. వెంకటేష్, టి. వెంకటరావు, ఎం. ధర్మరావు, ఎం. నాగరాజు, ఎం. దాలినాయుడు తదితర సిబ్బందిని జిల్లా పోలీసు ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.


#Andhra Pradesh Police Dgp #Andhra Pradesh #Srikakulam District Police

Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >
Image 1

పత్రికా స్వేచ్ఛ… సమాజం ఊపిరి

Posted On 2026-05-02 22:28:56

Readmore >