| Daily భారత్
Logo




ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి : అదనపు కలెక్టర్ కె.చంద్రా రెడ్డి

News

Posted on 2026-01-23 18:51:39

Share: Share


ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి : అదనపు కలెక్టర్ కె.చంద్రా రెడ్డి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రతి ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ కె.చంద్రా రెడ్డి అన్నారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కె.చంద్రా రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మన భారత దేశం ప్రపంచంలో అతి పెద్దదైన  ప్రజాస్వామ్య దేశమని, ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలని, ఓటు హక్కు విలువ మనతోపాటు, తోటి వారికి తెలియజేయలన్నారు. ఓటును తాత్కాలిక ప్రలోభాలకు లొంగకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో మనమందరం బాధ్యతగా పాల్గొని ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు.

అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ "భారత దేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని" వివిధ శాఖల అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లా గ్రామీణాభివృద్ది పిడి మరియు స్వీప్ నోడల్ అధికారి శ్రీలత, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >
Image 1

పత్రికా స్వేచ్ఛ… సమాజం ఊపిరి

Posted On 2026-05-02 22:28:56

Readmore >